Switch to English

బోటులో భంచిక్‌: ఎక్కడో ఏదో తేడా కొడ్తోంది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

సుమారు 50 మంది ప్రాణాలు గోదాట్లో కలిసిపోయాయి.. మునిగిన బోటు ఇంకా పైకి రాలేదు.. ఆ బోటులోంచి కొంతమంది సురక్షితంగా బయటపడినా.. ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలు ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాని పరిస్థితి వుంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా.. ఇప్పటిదాకా బోటు మాత్రం నీట్లోంచి బయటకు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క, మాజీ ఎంపీ హర్షకుమార్‌, బోటు ప్రమాదంపై సంచలన ఆరోపణలు చేశారు.

పర్యాటక శాఖకు చెందిన అధికారుల కారణంగానే జల విహారంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్నది ఆయన ఆరోపణ. పైగా, బోటు బయటకు తీసేందుకు అవకాశం వున్నా, కావాలనే ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చేయడంలేదని ఆరోపిస్తున్నారాయన. అక్కడితో ఆగలేదు. బోటులో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని హర్షకుమార్‌ సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. నిజానికి, ఇదేమీ కొత్త ఆరోపణ కాదు. చాలా కాలంగా వున్నదే. పర్యాటకం పేరుతో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్న మాట వాస్తవం. కొన్ని రిసార్టుల విషయంలో ఇది ఎప్పటికప్పుడు నిజమని నిరూపితమవుతూనే వుంది.

పర్యాట శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బోట్లలోనూ అసాంఘీక కార్యకలాపాలపై ఆరోపణలు వెల్లువెత్తుతూనే వున్నాయి. ఆ విషయాల్నే ఆయనిప్పుడు ప్రస్తావించారు. బోటు యజమానులతో అధికారులు కుమ్మక్కయి, నిబంధనలకు విరుద్ధంగా బోట్లను నడుపుతున్నాన్న హర్షకుమార్‌ ఆరోపణల్ని కొట్టి పారేయలేం. చంద్రబాబు హయాంలో కృష్ణా నదిలో బోటు మునిగినప్పుడు వైసీపీ ఇవే ఆరోపణలు చేసింది. దురదృష్టవశాత్తూ అప్పట్లో వైసీపీ ఎవరి మీద అయితే ఆరోపణలు చేసిందో, ఆ వ్యక్తికి తాము అధికారంలోకి రాగానే మళ్ళీ కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం.

అయితే, ఇప్పుడు గోదావరిలో బోటు మునక వ్యవహారంలో అసాంఘీక కార్యకలాపాలకు ఆస్కారం వుందా.? అసలు ఈ ఘటనకు బాధ్యులెవరన్నదానిపై వైసీపీ సీరియస్‌గా స్పందించడంలేదు. తూతూ మంత్రంగా కమిటీలు ఏర్పాటు చేసినా, ప్రభుత్వంపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని గతంలో వాదించిన వైఎస్‌ జగన్‌, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆ విషయమై మౌనం దాల్చుతుండడం గమనార్హం. ఇదిలా వుంటే, మంత్రి అవంతి శ్రీనివాస్‌, హర్షకుమార్‌ ఆరోపణలపై మండిపడ్డారు. పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిస్తున్నారు కూడా.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...