‘కేవలం పసుపు రంగునే కాదు, అన్ని రంగుల్నీ కాషాయంగా మార్చేయగల బలం బీజేపీకి వుంది. ప్రస్తుతం రఘురామకృష్ణరాజుగారు ఫేడ్ చేస్తోన్న మీ రంగుని మీరు కాపాడుకోండి..’ అంటూ భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అయిన వైఎస్సార్సీపీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది సోషల్ మీడియా వేదికగా. బీజేపీ సీనియర్ నేత, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దేవ్ధర్ ఈ మేరకు వేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఈ ట్వీట్ ఆయన వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చేశారు.
‘బీజేపీ కమలం మీదకు పసుపు మిడతల దండు షురూ అయ్యింది..’ అంటూ బీజేపీని అప్రమత్తం చేస్తున్నట్లు పోజు ఇస్తున్న విజయసాయిరెడ్డికి ఇంతకన్నా మాస్టర్ స్ట్రోక్ ఇంకేముంటుంది.? కన్నా లక్ష్మినారాయణను ఉద్దేశించి విజయసాయిరెడ్డి సెటైరికల్గా ట్వీటేశారు. ఈ క్రమంలో ఆయనకు సునీల్ దేవ్ధర్ నుంచి తెలుగులోనే ట్వీట్ రావడం గమనార్హం.
ఇక్కడ రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. ఒకటేమో, బీజేపీలో టీడీపీ అనుకూల వర్గం వుందంటూ విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రచారాన్ని ఖండించడం. ఇంకోటి, రాష్ట్రంలో ముందు ముందు వైసీపీ ‘రంగు’ వెలిసిపోతుందని బీజేపీ హెచ్చరించడం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇంకోటుంది.. రఘురామకృష్ణరాజు త్వరలో బీజేపీలో చేరబోతున్నారన్న సంకేతాల్ని సునీల్ దేవ్ధర్ తన ట్వీట్ ద్వారా పరోక్షంగా చెప్పినట్లుంది పరిస్థితి.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి పార్టీ అధిష్టానం ఇప్పటికే షోకాజ్ నోటీస్ ఇవ్వడంతోపాటు, ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీల బృందం ఇటీవల లోక్సభ స్పీకర్ని కలిసిన విషయం విదతమే. ఇక, నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు కొంత కాలం క్రితమే బీజేపీలో చేరిపోయారు. ఆ చేరికకు రాజ్యసభ ఛైర్మన్ కూడా గతంలోనే ఆమోద ముద్ర కూడా వేసేశారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కూడా త్వరలో బీజేపీలో చేరిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే, రఘురామకృష్ణరాజు ఒక్కర్నే కాకుండా మరికొంతమందిని లాగే ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్లుంది. అదే జరిగితే, సునీల్ దేవ్ధర్ చెబుతున్నట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రంగు వెలిసిపోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చేమో.!
ఇంతకీ, విజయసాయిరెడ్డి బీజేపీని ఎందుకు కెలుకుతున్నట్లు.? బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో ఎందుకు తలదూర్చుతున్నట్లు.? బీజేపీని కెలకడం ద్వారా విజయసాయిరెడ్డి వైసీపీకి చేటు చేస్తున్నారన్న చర్చ వైసీపీ వర్గాల్లో ఎందుకు జరుగుతోంది.? ఇదంతా వైసీపీ అధినేత వైఎస్ జగన్కి తెలిసే జరుగుతోందా.? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
.@VSReddy_MP గారూ,
కేవలం పసుపు రంగునే కాదు…అన్ని రంగుల్ని కాషాయం చేయగల బలం @BJP4India కి ఉంది. ప్రస్తుతం @RaghuRaju_MP గారు ఫేడ్ చేస్తున్న మీ రంగుని మీరు కాపాడుకోండి. @BJP4Andhra@klnbjp pic.twitter.com/LmgQNKDXgD— Sunil Deodhar (@Sunil_Deodhar) July 9, 2020
ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు.
లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారు.
టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా..?
బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్న..
ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా.?— Vijayasai Reddy V (@VSReddy_MP) July 8, 2020
158555 233952I adore your wordpress web template, wherever would you download it from? 487925