భలే పెట్టాడు బిగ్ బాస్ ఫిట్టింగు.! ఇది స్వయంగా హౌస్ మేట్స్ అంటున్న మాటే.! మహిళలు.. మహరాణులు.. అంటూ వాళ్ళకేవో ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఇస్తాడనుకుంటే, మహిళా కంటెస్టెంట్లు జుట్టూ జుట్టూ పట్టుకోండన్నట్టు.. వాళ్ళ మధ్యన నామినేషన్ల పర్వం పెట్టాడు బిగ్ బాస్.
మేల్ కంటెస్టెంట్లు, ఈ నామినేషన్స్ ప్రాసెస్కి దూరంగా వున్నారు. అంటే, మహిళా కంటెస్టెంట్లను నామినేట్ చేయడానికి అవకాశం మేల్ కంటెస్టెంట్లకు లేదన్నమాట. రతిక రోజ్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అశ్విని.. ఈ నలుగురే ఫిమేల్ కంటెస్టెంట్లుగా వున్నారు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో.
అశ్విని వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాగా, రతిక రోజ్ వైల్డ్ కార్డ్ ద్వారా రీ-ఎంట్రీ సాధించింది. శోభా శెట్టి, ప్రియాంక జైన్.. మొదటి నుంచీ హౌస్లో వున్నారు. ఈ సీజన్లో గ్రూపిజం చాలా బాగా వర్కవుట్ అయ్యింది ఇటు శోభా శెట్టికీ, అటు ప్రియాంక జైన్కీ.
సో, ఆటోమేటిక్గా అశ్విని లేదా రతిక టార్గెట్ అవుతారు. ప్రియాంక – శోభా శెట్టి మధ్య కమ్యూనికేషన్ బాగా సెట్ అయ్యింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అశ్విని ఎవరికీ నచ్చకపోయినా, రతికని మొదటి నుంచీ టార్గెట్ చేస్తున్న ప్రియాంక, శోభా శెట్టి.. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి, ఆమెను నామినేట్ చేశారు.
వాస్తవానికి ప్రియాంక – రతిక మధ్య ‘టై’ వచ్చింది. ఇద్దరికీ, నామినేషన్లు సమానంగా పడ్డాయ్. దాంతో, బిగ్ బాస్ వ్యూహాత్మకంగా నిర్ణయాన్ని కెప్టెన్ శోభా శెట్టికి వదిలేశాడు. శోభా శెట్టి ఎలాగూ రతికనే నామినేట్ చేస్తుంది కదా.? అదే జరిగింది.!
కాగా, ‘జెల్’ వ్యవహారం రతిక – శోభా శెట్టి మధ్య వాగ్యుద్ధానికి తెరలేపింది. ‘జెల్’ అవడం, అంటే కలిసిమెలిసి వుండడం.. అనుకోవచ్చు.. ఈ విషయంలోనే వాగ్యుద్ధం గట్టిగా నడిచింది. ‘ఆఫ్ట్రాల్ నువ్వు’ అని రతిక నోరు జారితే, ‘వీక్ కంటెస్టెంట్ నువ్వు’ అని రతికని ఎగతాళి చేసింది శోభా శెట్టి.