Switch to English

బిగ్‌ షాక్‌: గన్నవరం వైసీపీలో ముసలం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కొండ నాలికకి మందేస్తే.. ఉన్న నాలిక ఊడిపోయిందట.! వెనకటికి ఓ గట్టి సామెత ఇది.! అసలు విషయంలోకి వస్తే, కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 2014 ఎన్నికల్లో నానా కష్టాలూ పడి విజయం సాధించారు టీడీపీ నేత వల్లభనేని వంశీ. ఇక్కడ పోలింగ్‌ రోజున నడిచిన హైడ్రామా అంతా ఇంతా కాదు. ‘వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి గెలిచాను..’ అని గర్వంగా చెప్పుకున్నారు వల్లభనేని వంశీ. వైసీపీ ప్రభుత్వం తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రపన్నుతోందనీ ఆరోపించారు. కానీ, ఏమయ్యిందో.. అనూహ్యంగా ఆయన ‘యూ టర్న్‌’ తీసుకున్నారు. ‘కడుపుకు అన్నం తినేటోడెవడూ వైసీపీలోకి వెళ్ళడు..’ అని చెప్పిన వల్లభనేని వంశీనే, వైసీపీ వైపు అడుగులేశారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలేననుకోండి.. అది వేరే విషయం.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే వైసీపీతో అంటకాగుతున్నారు వల్లభనేని వంశీ. అయితే, ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు.. ఎమ్మెల్యేల వల్లభనేని వంశీ వర్గంతో కలిసి ముందుకు సాగలేకపోతున్నారు. వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు, గన్నవరం ఉప ఎన్నిక వస్తే తనకు అవకాశమివ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి తెస్తుండడం గమనార్హం. ఒకవేళ వంశీకే మళ్ళీ అవకాశమిస్తే, తాము సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌ఛార్జి మినిస్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరే పంచాయితీ పెట్టారు దుట్టా రామచంద్రరావు, ఆయన వర్గీయులు.

నిజానికి, వల్లభనేని వంశీ, వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నప్పుడే, ఆ ప్రయత్నాలకు మోకాలడ్డేందుకు దుట్టా రామచంద్రరావు ప్రయత్నించారు. అయితే, అధిష్టానం అప్పట్లో ఆయన్ని బుజ్జగించింది. ఇప్పుడేమో పరిస్థితి చెయ్యిదాటేలా కన్పిస్తోంది. ఇదిలా వుంటే, టీడీపీకి దూరంగా వుంటోన్న వల్లభనేని వంశీపై రాజీనామా ఒత్తిడి పెరుగుతున్న దరిమిలా, వైసీపీ నేతలు, కార్యకర్తల నుంచి వస్తున్న వ్యతిరేకతతో గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

‘వంశీని చేర్చుకోవడం వల్ల పార్టీకి బలమా.? శాపమా.?’ అన్న దిశగా ఇప్పుడు వైసీపీ అధిష్టానం పునరాలోచనలో పడిందన్న చర్చ జరుగుతోంది. అందుకు వల్లభనేని వంశీ వ్యవహారశౖలి కూడా ఓ కారణం. ఏ క్షణాన ఆయన పార్టీకి ఎదురు తిరుగుతారో ఊహించడం కష్టం. గతంలో వైసీపీపై ఆయన చేసిన విమర్శల్ని.. వైసీపీలో చాలామంది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారట. అయినాగానీ, జగన్‌ ‘దయ’ వుంటే, వంశీకి వైసీపీలో పెద్దగా ఇబ్బందులు వుండవని వంశీ వర్గం అభిప్రాయపడుతోంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...