బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సెంటిమెంట్ మరోసారి వర్కవుట్ అయింది. అయన తాజాగా నటించిన భారత్ చిత్రం ఈ రంజాన్ కానుకగా విడుదలై సూపర్ హిట్ అవ్వడమే కాదు కేవలం మూడు రోజుల్లోనే వందకోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. సల్మాన్ ఖాన్ హీరోగా కత్రినా, దిశా పటాని హీరోయిన్స్ గా ఆలి అబ్బాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారత్ ఈనెల 5న రంజాన్ కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ సెంటిమెంట్ గా ప్రతి ఈద్ కు తన సినిమా విడుదల ప్లాన్ చేస్తాడు సల్మాన్ ఈ సారి కూడా భారత్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దాదాపు 5000 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే భారీ వసూళ్లు అందుకుంది. 42. 30 కోట్లతో సల్మాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో రికార్డును అధిగమించింది. రెండో రోజు 31 కోట్లు, మూడో రోజు 28 కోట్లను వసూలు చేసి .. కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరి పోయింది. తన సినిమాకు ఇంతటి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షుకులకు సల్లు భాయ్ ధన్యవాదాలు చెప్పాడు. ఈ సినిమా సక్సెస్ చేసిన నా ఫాన్స్ కు అలాగే ప్రేక్షకులకు థాంక్స్ అని తెలిపాడు.
ఇక తన నెక్స్ట్ సినిమా విషయంలో అప్పుడే రంగంలోకి దిగిన సల్మాన్ వచ్చే ఈద్ సందర్బంగా మరో చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నట్టు అప్పుడే ప్రకటించాడు. సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో ఇన్షా అల్లా అనే చిత్రాన్ని చేస్తున్నాడు. అలియా భట్ హీరోయిన్.
Releated Posts
సాహో కోసం రంగంలోకి..దిల్ రాజు?