కేవలం 108 చదరపు అడుగుల స్థలాన్ని వేలంలో 1.20 కోట్లు పలకడమే విశేషమైతే.. అంత మొత్తం పెట్టి కొనుగోలు చేయడం మరింత విశేషం. అయితే.. కొన్నది పెద్ద వ్యాపారవేత్తో, పారిశ్రామికవేత్తో అనుకుంటే మాత్రం పొరపాటు. అంత చిన్న స్థలాన్ని, భారీ మొత్తంతో కొనుగోలు చేసింది ఓ తోపుడు బండి వ్యాపారి. 40 ఏళ్లుగా అదే ప్రదేశంలో తోపుడుబండిపై అరటిపండ్లు అమ్ముకుని జీవనం సాగిస్తున్న జిలానీ అనే వ్యాపారి ఈ స్థలం కొన్నాడు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిందీ విశేషం. ముంబై జాతీయ రహదారికి ఆనుకుని, బస్టాండ్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ 40 ఏళ్లుగా తోపుడు బండిపై అరటిపండ్లు విక్రయిస్తున్నాడు. ఇటీవల ఆ ప్రాంతంలో పాత షాపులు పడగొట్టి, కొత్తగా కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారు. విషయం తెలియడంతో అచ్చొచ్చిన స్థలాన్ని వదులుకోలేక ఆ స్థలం కొనాలని ఫిక్సయ్యాడు. దీంతో బుధవారం జరిగిన వేలంలో 108 చదరపు అడుగుల స్థలాన్ని 1.20 కోట్లకు సొంతం చేసుకున్నాడు జిలానీ. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది.
361189 163730Excellent beat ! I wish to apprentice although you amend your internet website, how can i subscribe for a weblog web site? The account aided me a appropriate deal. I had been a little bit acquainted of this your broadcast provided bright clear notion 142767