మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ దర్శకుడిగా గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. అజ్ఞాతవాసితో వచ్చిన బ్యాడ్ నేమ్ ను అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాలతో తుడిచిపెట్టేసాడు త్రివిక్రమ్.
అయితే ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమాను సెట్ చేయడానికి చాలానే సమయం తీసుకున్నాడు. ఈలోగా పవన్ కళ్యాణ్ కు ప్రాజెక్ట్స్ సెట్ చేయడం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో చిత్రాలు చేయడానికి డైరెక్ట్ కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నది అందరికీ తెల్సిన విషయమే.
దీని వల్ల ఎందుకనో త్రివిక్రమ్ బ్రాండ్ ఇమేజ్ బీటలు వారుతోంది. అందులోనూ బ్రో కి డైలాగ్స్, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించాడు. ఆ విషయంలో కూడా కొన్ని ట్రోల్స్ ను ఎదుర్కొన్నాడు. ఈ ప్రాజెక్ట్స్ ను మెయిన్ లైన్ లో పెట్టుకుని మహేష్ తో చేస్తోన్న గుంటూరు కారంను పూర్తిగా విస్మరిస్తున్నాడు అనే విమర్శ కూడా ఉంది.