Switch to English

ఆకలికీ, సాయానికీ మతం లేదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

తరాలు తిన్నా తరగని ఆస్తి పాస్తులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు కొందరు. ఎంత సంపాదించినా అవి తమ జీవితాలకే సరిపోదనుకునే వారు ఇంకొందరు. ఉన్నంతలో పది మందికీ సాయం చేయాలనుకునేవారు మరికొందరు. కులం, మతం, ప్రాంతం ఇలాంటి లెక్కలేసుకుని సాయాలు చేసే వారినీ చూస్తుంటాం. పావలా సాయం చేసి, పది రూపాయల పబ్లిసిటీ పొందాలనుకునే వారి సంఖ్య తక్కువేమీ కాదు. సాటి మనిషికి సాయం చేయడం మానవత్వం మాత్రమే కాదు, దైవత్వం కూడా.. అని భావించేవారూ లేకపోలేదు. అలాంటి ఓ గొప్ప వ్యక్తి కథ ఇది.

‘అజార్‌ మక్సుసి’ అనే ఓ వ్యక్తి హైద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వద్ద ప్రతీ రోజూ పేదల కోసం ఆహారాన్ని ఉచితంగా అందిస్తుంటారు. తాను చేసేది సాయం కాదనీ, మానవత్వమే తనతో ఈ పని చేయిస్తోందనీ, ఆకలికీ, సాయానికీ మతంతో పని లేదనీ చెప్తాడాయన. చిన్నప్పుడు తిండికి లేక, ఎన్నో కష్టాలు అనుభవించాననీ, తను నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయాననీ, అజార్‌ మక్సుసి చెప్పారు. ఆకలితో పస్తులున్న ఎన్నో రోజులు తన కళ్ల ముందు ఇంకా కదలాడుతున్నాయనీ, తాను పని చేయడం ప్రారంభించాక, సంపాదించే ఆ కొద్ది మొత్తంలో కొంత ఇతరులకు సాయం చేసేందుకు వ్యత్యించాలనుకున్నాననీ అన్నారాయన.

ఆనాటి ఆ ఆలోచన ఆ తర్వాత ఓ మహిళకు ఆహారం అందించడం ద్వారా కార్యరూపం దాల్చిందనీ, తొలి సారిగా ఆ సాయం చేసిన తర్వాత చాలా తృప్తిగా అనిపించిందనీ, అప్పుడే దేవున్ని ప్రార్ధించి పది మందికి సాయం చేసే శక్తినివ్వాలని కోరుకున్నాననీ అన్నారు మక్సుసి. అప్పుడు మొదలైన ఆ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెప్పారు. డబీర్‌ పురాలో ఈ ఆహారం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి, దాన్ని గాంధీ ఆసుపత్రికి విస్తరించారు. రోజూ సుమారు 400 మందికి ఆహారమందిస్తున్నారు.

నాలుగేళ్లుగా గాంధీ ఆసుపత్రి దగ్గరా, ఏడేళ్లుగా డబీర్‌ పురాలో అందిస్తున్న ఈ ఆహార పంపిణీ క్రమ క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించారు మక్సుసి. బెంగుళూరు, రాయచూర్‌, జార్ఖండ్‌, అస్సాం తదితర ప్రాంతాల్లో 1000 నుండి 1200 మంది వరకూ ఈ ఉచిత ఆహారంతో కడుపు నింపుతున్నారు. జగదీష్‌ అనే ఓ కార్మికుడు ఈ ఆహార పంపిణీ గురించి మాట్లాడుతూ, ఏడాదిగా తనకు హైద్రాబాద్‌లో ఉచితంగా ఆహారం దొరుకుతోందనీ, పని లేనప్పుడు మాత్రమే తాను ఉచితంగా అందించే ఈ భోజనం కోసం వస్తుంటాననీ చెప్పారు.

ఎందరో పేదలు, తమ కడుపు నింపుతోన్న అజార్‌ మక్సుసికి కృతజ్ఞతలు చెబుతున్నారు. దేవుడు మనిషి రూపంలో రావడమంటే ఇదేననీ సాయం పొందుతోన్న పేదలు చెబుతోంటే, అజార్‌ మాత్రం దేవుడే తన ద్వారా పేదల కడుపు నింపుతున్నాడనీ, తాను నిమిత్త మాత్రుడననీ మనిషిగా తాను చేయగలిగినది చేస్తున్నాననీ, దీన్ని గొప్ప పనిగా భావించడం లేదనీ, బాధ్యతగా మాత్రమే భావిస్తున్నాననీ అంటున్నారు. రియల్‌ హీరో అంటే అజార్‌ మక్సుసి అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అన్నదాతా సుఖీభవా.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....