ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. సీఎం జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకూ టీటీడీ ఈవోగానూ కొనసాగుతారు.
రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా పి.సీతారామాంజనేయుల్ని నియమించింది. ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న కేవీ. రాజేంద్రనాధ్ రెడ్డిని ఏసీబీ చీఫ్ గా బదిలీ చేసింది. ఆయనే ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా అదనపు హోదాలో కూడాఉన్నారు.
ప్రస్తుతం సీసీఎల్ఏగా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ను అటవీ పర్యావరణ,సాంకేతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆస్థానంలో ఉన్న విజయకుమార్ను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది.
ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డైరక్టర్ జనరల్ గా ఉన్న శంఖబ్రత బాగ్చీని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరక్టర్ జనరల్ గా నియమించింది. ఏపీ ప్రణాళికా విభాగం సీఈఓగానూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
జి.సాయిప్రసాద్ ను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)గా నియమించింది. ఆయనకు రెవెన్యూ భూరికార్డులు, విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవకు యువజన సర్వీసులు, క్రీడలశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆర్ధికశాఖ హెఆర్ విభాగం ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ ను జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయనకు సాధారణ పరిపాలనశాఖ హెఆర్ సర్వీసుల విభాగం ముఖ్యకార్యదర్శిగానూ అదనపు బాధ్యతలూ అప్పగించారు.
రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుకి రవాణా శాఖ కమిషనర్ పోస్టుని పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించారు.
పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఎండీగా ఉన్న ఎ.బాబుకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతను అప్పగించింది. ప్రస్తుతం ఈ పోస్టుని సీతారామాంజనేయులు అదనపు పోస్టుగా చూస్తున్నారు.
759145 849162Perfect just what I was looking for! . 708011
845955 225640The vacation delivers on offer are : believed a selection of some of the most selected and moreover budget-friendly global. Any of these lodgings tend to be extremely used along units could accented by means of pretty shoreline supplying crystal-clear turbulent waters, concurrent with the Ocean. hotels packages 735153