జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నాయకులకు చెప్పు చూపించారట.. తిట్టారట.. మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారట.. స్టెప్నీ.. అంటూ వ్యాఖ్యానించారట.. అలాగని పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏకంగా నోటీసులు జారీ చేసేశారు.
మరి, ఇప్పుడు ఏపీ మహిళా కమిషన్ ఏం చేస్తోంది.? ఇద్దరు మహిళల్ని కొందరు వ్యక్తులు ఏకంగా ‘సజీవ సమాధి’ చేసేందుకు యత్నించారు. మట్టిని వాళ్ళపై పోసి.. చంపేద్దామనుకున్నారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించిన సదరు నిందితుల విషయమై మహిళా కమిషన్ ఎందకు స్పందించలేదు.?
ఇంతకీ, వైసీపీ నేత.. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఎక్కడ.? సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై వాసిరెడ్డి పద్మ స్పందిస్తారా.? లేదా.? స్పందించకపోవచ్చు. ఎందుకంటే, ఈ దారుణానికి పాల్పడింది వైసీపీకి చెందిన నాయకులే మరి.!
చిన్న నాయకుడైనా పెద్ద నాయకుడైనా.. ఆఖరికి సాధారణ కార్యకర్త అయినా సరే, వారికి బులుగు రాజ్యాంగం ప్రకారం కొన్ని వెసులుబాట్లు వుంటాయ్. కొడాలి నాని బూతులు తిడితే, ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్పందించలేదు. మంత్రి గుడివాడ అమర్నాథ్ విషయంలోనూ అంతే. అంబటి రాంబాబు వ్యవహారంలోనూ ఏపీ మహిళా కమిషన్ సైలెంటుగానే వుంది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నిందితులు మరీ వైసీపీలో పెద్ద నాయకులేమీ కాదు. అయినాగానీ, బులగు కావరం.. వాళ్ళని ఇంతటి దారుణానికి తెగబడేలా చేసింది. పైగా, బాధితులు సదరు బులుగు నాయకుడి బంధువులే.
ఏమో, సరదాగా మట్టి ఆట ఆడుకున్నారంతే.. అని వైసీపీ చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇటీవల సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే, మృతదేహాన్ని బైక్ మీద తీసుకెళ్ళాల్సి వచ్చింది మృతుడి కుటుంబీకులకి. అంబులెన్సులు ఏమైపోయాయ్.? అని జనం ప్రశ్నిస్తోంటే, ‘అబ్బే, ప్రభుత్వం వారికి అండగా నిలిచింది..’ అంటూ బాధితులతోనే బలవంతంగా చెప్పించిన ఘనత అధికార పార్టీది.
మట్టి కుప్పలో పాతేసి చంపేద్దామనుకున్న వైసీపీ కింకరులు, దీన్ని ‘మడ్ బాత్’ అని పేరు పెట్టి కొత్త కథ అల్లితే అందులో ఆశ్చర్యమేముంది.? దారుణ హత్యని, గుండు పోటుగా చిత్రీకరించడం వైసీపీకి మాత్రమే తెలిసిన విద్య మరి.
882040 62172It can be difficult to write about this subject. I believe you did a fantastic job though! Thanks for this! 485396