సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం( Guntur Kaaram)’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలోని అన్ని థియేటర్లలో టికెట్ పై 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. సినిమా విడుదలైన 10 రోజులపాటు ఈ ధరలు అమల్లో ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సింగిల్ స్క్రీన్ పై రూ.65, మల్టీప్లెక్స్ లలో రూ. 100 పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది.
‘ఖలేజా’, ‘అతడు’ చిత్రాల తర్వాత త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ఆ రెండు సినిమాలు హిట్ కొట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ లీల( Sree leela), మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లు. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి.