Switch to English

రాజధాని అమరావతి ఎపిసోడ్‌లో షాకింగ్‌ ట్విస్ట్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘రాజధాని ఎక్కడ వుండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. రాజధానికి భూములు ఇచ్చినంతమాత్రాన రాజధాని ఎక్కడ వుండాలో నిర్ణయించేది అమరావతి ప్రాంత రైతులు కాదు.. రాజధాని తరలింపు కోసం ఖర్చయ్యేది కేవలం 70 కోట్లు మాత్రమే.. రాజధాని తరలింపుని ఏ ఉద్యోగ సంఘమూ ఇప్పటిదాకా వ్యతిరేకించలేదు..’ అంటూ సచివాలయ ఉద్యోగుల సంఘం న్యాయస్థానానికి విన్నవించుకుంది రాజధాని అమరావతి విషయంలో. ఇది నిజంగానే షాకింగ్‌ ట్విస్ట్‌గా చెప్పుకోవాలి.

నిజమే, రాజధాని ఎక్కడ.? అన్న విషయాన్ని నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధాని మారితే ఎలా.? మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చింది.. అంటే, ఉద్యోగులు మూడు వైపులకు విడిపోవాల్సిందేనా.? తర్వాతి ప్రభుత్వం ముప్ఫయ్‌ రాజధానులంటుంది.. అప్పుడు పరిస్థితి ఏంటి.? ఇంకో ప్రభుత్వం మూడు వందల రాజధానులని చెబితే ఏం చేయాలి.? అయినా, రైతులు ప్రభుత్వానికి భూములు ఎందుకు ఇచ్చారన్నది కీలకం. అప్పటి అధికార పక్షం, ప్రతిపక్షం.. కలిసి నిర్ణయం తీసుకుంటేనే అమరావతి రాజధాని అయ్యింది.

చట్ట సభల సాక్షిగా అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి అంగీకారం తెలిపాయి. అలా శాసన సభను నమ్మి.. రైతులు, ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. తమ ప్రాంతంలో రాజధాని వస్తుంది కాబట్టే ఆ రాజధానికి తమ భూముల్ని ఇచ్చారు రైతులు. నిజానికి, ప్రపంచ చరిత్రలో ఇలాంటి త్యాగం ఇంకెక్కడా జరగలేదన్నది నిర్వివాదాంశం. పచ్చని పంట పొలాల్ని ఊరికినే కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చేస్తామంటే రైతులు ఒప్పుకుంటారా.? రాజధాని కోసం రైతుల్ని ఒప్పించే క్రమంలో అప్పటి ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది. అవన్నీ రికార్డెడ్‌ హామీలు. చట్టబద్ధమైన ఒప్పందాలు.

సరే, రాజధాని పేరుతో చంద్రబాబు సర్కార్‌ ‘భూ దందా’ చేసిందనే వైసీపీ ఆరోపణలూ లేకపోలేదే. అలా భూ దందా ఎవరు చేశారో వారిపై చర్యలు తీసుకోవచ్చు. చంద్రబాబు చెప్పినదానికంటే అద్భుతంగా అమరావతిని తీర్చిదిద్ది ఆ క్రెడిట్‌ని వైసీపీ తన ఖాతాలో వేసుకోవడానికి అవకాశముంది. కానీ, ఇక్కడ ఎందుకో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం భేషజాలకు పోతోంది. ఈ ఎపిసోడ్‌లోకి ఉద్యోగ సంఘాలు ఎంటర్‌ అవడం కాస్తంత ఆశ్చర్యకరమే. హైద్రాబాద్‌ నుంచి అమరావతికి తరలి వచ్చే క్రమంలో ఉద్యోగులు చాలా షరతులు ప్రభుత్వం ముందుంచారు. కానీ, రైతులు మాత్రం.. అమరావతి విషయంలో తమకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీయకూడదట. ఎవరి మెప్పు కోసం ఈ వింత వాదనను ఉద్యోగ సంఘాలు తెరపైకి తెచ్చినట్లు.? హైద్రాబాద్‌ నుంచి అమరావతికి.. అమరావతి నుంచి విశాఖకు.. నెక్స్‌ట్‌ ఏంటి.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...