‘అప్పులు ఎలా చెయ్యాలో చంద్రబాబు చూపించారు.. అభివృద్ధి ఎలా చెయ్యాలో మేం చూపిస్తాం..’ అంటూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చెబితే జనం నిజమేననుకున్నారు. అభివృద్ధి ఎక్కడ.? అని బూతద్దం వేసి వెతకాల్సిన పరిస్థితి ఇప్పుడు. కానీ, అప్పులు చేయడంలో మాత్రం చంద్రబాబుని మించిపోతున్నారు వైఎస్ జగన్ మోహన్రెడ్డి. టీడీపీ హయాంలో జరిగిన అప్పుల్ని మించిపోయేలా అప్పులు చేసేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. గడచిన రెండు నెలల్లో సుమారుగా 30 వేల కోట్లు అప్పులు చేసిందంటూ లెక్కలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ లెక్కన సగటున ఆంధ్రప్రదేశ్లో ఒక్కో వ్యక్తి మీదా రోజుకి 97 రూపాయల అప్పు భారాన్ని వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం మోపుతోందంటూ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అంచనాలు వేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా టీడీపీ మద్దతుదారులే కాదు, ఇతర విపక్షాలకు చెందిన మద్దతుదారులూ నినదిస్తున్నారు.
‘కరోనా వైరస్’ కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ‘సాకు’గా చూపిస్తుండొచ్చుగాక. కానీ, అప్పులు ఇప్పుడు కొత్తగా మొదలైనవి కావు. ముఖ్యమంత్రి అవుతూనే ‘అప్పుల పర్వం’ షురూ చేశారు వైఎస్ జగన్ మోహన్రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు అలాంటివి మరి. చంద్రబాబు గ్రాఫిక్ మాయాజాలానికే పెద్దయెత్తున ఖర్చయ్యింది టీడీపీ హయాంలో. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు.. ‘చంద్రన్న’ సంక్షేమ పథకాలు.. ఇలా ఒకటేమిటి.? రాష్ట్రాన్ని నట్టేట్లో ముంచేశాయి. చంద్రబాబు పాలనలో వైఫల్యాల్ని చూసిన జనం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో అధికారమిస్తే.. ‘అంతకు మించి’ వైఫల్యాల్ని ఇప్పుడు చవిచూడాల్సి వస్తోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు’ తయారయ్యింది. ప్రభుత్వాలు అప్పులు చేయడం అనేది సర్వసాధారణం. కానీ, ఆ అప్పుల భారం మోసేదెవరు.? ఇంకెవరు, ప్రజలే. మరి, సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే.. ఆ పబ్లిసిటీ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది.? ఇంకెవరికి.. అధికారంలో వున్నోళ్ళకి.! సొమ్ము ఒకడిది.. సోకు ఇంకొకడిది అంటే ఇదే మరి.
‘దేశంలో ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెడ్తాం..’ అని పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతుంటారు.. ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి రోజువారీ లెక్కల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ పొజిషన్లో నిలబెట్టేశారు. ఔను, ఇప్పటిదాకా నెంబర్ వన్లో వున్న మహారాష్ట్ర ఈ రోజు రెండో స్థానానికి పడిపోతే, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అప్పులోనూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అవతరించడానికి బహుశా ఎక్కువ సమయం పట్టదేమో.! అభివృద్ధి నాస్తి.. అప్పులేమో జాస్తి.. ఇదేం పాలన బాబోయ్.. అని రాష్ట్ర ప్రజానీకం నెత్తీ నోరూ బాదుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నది నిర్వివాదాంశం.
276352 742222Oh my goodness! an excellent article dude. Thank you Nonetheless Im experiencing problem with ur rss . Do not know why Cannot register for it. Could there be any person obtaining identical rss difficulty? Anybody who knows kindly respond. Thnkx 849064
344407 359050Ive applied the valuable points from this page and I can certainly tell that it gives lots of assistance with my present jobs. I would be very pleased to maintain obtaining back in this web page. Thank you. 214557
949964 136186brilliantly insightful post. If only it was as easy to implement some of the solutions as it was to read and nod my head at each of your points 723795