ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే సమావేశాలను నిర్వహించేందుకు సిద్దమైంది. మార్చి 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెలాఖరు వరకు సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టనుంది.
ఈసారి జెండర్ బడ్జెట్ను ప్రవేశపెడతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రకటనతో అధికార, ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశంలోనే పలు కీలక బిల్లులను ఆమోదించాలని రాష్ట్రం ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఈ సమావేశాల్లో మరింత ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.
660875 606494I think other site owners ought to take this site as an model, extremely clean and superb user genial design and style . 61187