Animal: గతేడాది ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాల్లో యానిమల్ (Animal) ఒకటి. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.900కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమాకు సీక్వెల్ గా ‘యానిమల్ పార్క్’ ఉంటుందని గతంలోనే ప్రకటించారు సందీప్ రెడ్డి. సినిమా షూటింగ్ 2025 నుంచి ప్రారంభమవుతుందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించారని తెలుస్తోంది. దీనికి ముందే ప్రభాస్ తో సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీ తెరకెక్కిస్తారని అంటున్నారు.
మరోవైపు.. యానిమల్ మూవీతో సందీప్ రెడ్డిపై క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. యానిమల్ కంటే భారీ యాక్షన్, వయలెన్స్, పాత్రల్లో భారీతనం, క్యాస్టింగ్ భారీగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న యానిమల్ ఏకంగా 6.2మిలియన్లతో మోస్ట్ వ్యూవర్ షిప్ ఇండియన్ సినిమాగా రికార్డులు సృష్టిస్తోంది. సినిమాలో లేని 8నిముషాల సన్నివేశాలు ఓటీటీలో ప్రసారమవుతున్నాయి.