పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నప్పటికీ హైదరాబాద్లో రేవ్ పార్టీ కల్చర్ కొనసాగుతోనే ఉంది. ఇటువంటి పార్టీలు వ్యాపారవేత్తలు, నాయకులు అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహిస్తూంటారు.
మందు, విందు, చిందు ఇందులో కామన్ విషయం. నిన్న పాతబస్తీలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఇదే రేవ్ పార్టీని ఎంఐఎం కార్యకర్తలు నిర్వహించడం కలకలం రేపుతోంది. చాంద్రాయణగుట్ట లో ప్రైవేటు గదిలో ఈ పార్టీ జరిగిందని తెలుస్తోంది.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు చూసి చూడనట్టుగా వదిలేశారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల మహిళలతో కలిసి మజ్లిస్ నేత ఫర్వేజ్ అతని స్నేహితులు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం సేవించి మగువలతో చిందులు వేశారని తెలుస్తోంది.
ఒకవైపు కరోనా సెకండ్ వెవ్ విజృంభణ జరుగుతున్నా ఇటువంటి పార్టీలు జరగడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఎంఐఎం పార్టీ నేత కాబట్టి పోలీసులు ఏం చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
997656 495422Last month, when i visited your weblog i got an error on the mysql server of yours. ~, 198363
641271 913287Black Ops Zombies is now available […]Take a look here[…] 645388