ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ పదవిలో వుండేందుకు అనర్హుడని రాజధాని అమరావతి ప్రాంత రైతులు తేల్చి చెబుతున్నారు. ‘రాష్ట్రంలో అందరికీ భోజనం పెట్టండి.. స్వాగతిస్తాం. కానీ, మేం తినే కంచంలోని అన్నాన్ని లాక్కోవద్దు..’ అంటూ అమరావతి పరిధిలోని మందడం గ్రామ రైతులు గగ్గోలు పెడుతున్నారు.
‘మేం రాజధాని కోసం భూములు ఇచ్చాం.. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందనీ, రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా వుంటారనే త్యాగం చేశాం.. ఇప్పుడు మా పొట్ట కొడుతున్నారు.. గత ఆరు నెలలుగా మా బతుకులు బుగ్గిపాలైపోయాయి.. ఇప్పుడిక రాజధాని అమరావతి నుంచి ఇంకో చోటకి తరలిపోతే.. మాకు మరణమే శరణ్యం..’ అంటున్నారు రైతులు.
‘మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిని స్మశానంతో పోల్చారు.. ఆ స్మశానంలో ఎందుకు అసెంబ్లీ సమావేశాలు పెట్టారు.?’ అని మరో రైతు ప్రశ్నించాడు. ఏడాదికి 30 నుంచి 60 రోజులు మాత్రమే చట్ట సభలతో ప్రజా ప్రతినిథులకు సంబందం వుంటుందనీ, ఒక్క చట్ట సభల్నే ఇక్కడ వుంచడం వల్ల అమరావతికి ఎలాంటి ఉపయోగం వుండదని మరో రైతు అభిప్రాయపడ్డాడు.
‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలవాలని కోరుకున్నాను.. ఆయన వెంట ప్రజా సంకల్ప యాత్రలో నడిచాను.. వందలాది మందిని వైసీపీ వైపు నడిపించాను.. కానీ, ఇప్పుడు జగన్ ఆలోచనలతో విభేదిస్తున్నాను.. నాలాంటి ఎందర్నో జగన్ మోసం చేశారు.. అమరావతి ఏ సామాజిక వర్గానికో పరిమితం కాదు.. జగన్, తన రెడ్డి సామాజిక వర్గానికి మేలు చేయడానికే ఇదంతా చేస్తున్నారా.?’ అని మరో రైతు కన్నీరు మున్నీరయ్యాడు.
మొత్తమ్మీద, రాష్ట్రంలో మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. రాష్ట్ర ప్రజానీకం ముక్త కంఠంతో దీన్ని ‘తుగ్లక్ చర్య’గా అభివర్ణిస్తున్నారు.
961634 687976Great beat ! I would like to apprentice whilst you amend your web internet site, how can i subscribe for a blog web site? The account helped me a applicable deal. I had been tiny bit acquainted of this your broadcast provided shiny transparent thought. 882914
31986 325965I was searching at some of your weblog posts on this site and I believe this internet internet site is real instructive! Maintain posting . 766834
185643 438752I enjoy this site, will certainly arrive back. Make certain you carry on writing high quality posts. 597239