భారత్-చైనా మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయా అంటే.. పరిస్థితులు ఔననే సమాధానం ఇస్తున్నాయి. శుక్రవారం లేహ్ పర్వత ప్రాంతాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ తన ఆయుధ సామాగ్రిని తరలించడం చర్చనీయాంశం అవుతోంది. ఇందుకు సంకేతంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆర్కేఎస్ బదౌరియా లేహ్ పర్వత ప్రాంతాల్లో 17, 18 తేదీల్లో లేహ్, శ్రీనగర్ లోని వాయుసేన శిబిరాలను సందర్శించారు. పరిస్థితులను అంచనా వేసి వాయుసేన తీరును పరిశీలించారు.
భారత్ కు పట్టున్న లడఖ్, టిబెట్, అదమ్ పూర్, హల్వారా, అంబాలా, సిర్సా శిబిరాల వద్ద ఎయిర్ ఫోర్స్ సర్వ సన్నద్ధంగా ఉంది. ఇక్కడ ఎగిరేందుకు సుఖోయ్30 ఎంకేఐ, మిరేజ్ 2000, జాగ్వార్ యుద్ధ విమానాలను ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ అక్కడకు తరలించింది. దాడికి అనుకూలించే అమెరికన్ అపాచీ హెలికాప్టర్లను కూడా తరలించింది. లేహ్ శిబిరం వద్ద చినూక్ హెలికాప్లర్లను సిద్ధం చేసింది. ఎంఐ17వీ5 మీడియం రేంజ్ హెలికాప్టర్లను తరలించింది. ఇవి సైనికులకు ఉపయోగపడతాయి. ఈ ప్రదేశంలో 14,000 అడుగుల ఎత్తులో ఎయిర్ ఫోర్స్ ఎస్ యు-30 యుద్ధ విమానాలను మోహరించింది.
వాస్తవాదీన రేఖ వెంబడి చైనా 10వేల మంది సైనికులను మొహరించిందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించడంతో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లడఖ్ కు సమీపంలోని ఈ రెండు ప్రాంతాల్లో యుద్ధ విమాన చర్యలకు అనుకూలంగా ఉండటంతో పాటు చైనాపై ఆధిపత్యం చెలాయించేందుకు అనువైన ప్రదేశం అని తెలుస్తోంది.
539939 725788Merely wanna input that you have a extremely nice website , I enjoy the pattern it really stands out. 644528
523928 594603I likewise conceive so , perfectly written post! . 66057
612837 916619Woh I like your blog posts, saved to fav! . 752454