మొన్నటి వరకు దేశంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందని మహిళ సంఘాల వారు ఆందోళన చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు ఏ ఒక్కరికి కూడా రక్షణ లేకుండా పోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో దేశంలో ఆవులకు కూడా రక్షణ లేకుండా పోయింది. కొందరు కామాంధులు రోడ్ల మీద తిరిగే ఆవులను కూడా వదలకుండా అత్యంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. కామాంధుల దాడిలో ఆవులు కూడా అఘాయిత్యంకు గురి అవుతుండటం దారుణం.
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్లో ఒక కామాంధుడు ఆవుపై అఘాయిత్యం చేసిన సంఘటన మర్చిపోకుండానే ఇప్పుడు గుజరాత్లో అదే పునరావృతం అయ్యింది. ద్వారక మున్సిపాలిటీలో కట్టేసి ఉన్న ఒక ఆవుపై ఆటో డ్రైవర్ అయిన భరత్ అశ్వర్ అనే వ్యక్తి అఘాయిత్యంకు పాల్పడ్డాడు. సీసీ టీవీలో రికార్డు అయిన దాన్ని బట్టి ఆవు అతడి నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించినా కూడా అతడు మాత్రం వదల్లేదు. అటుగా ఒక వ్యక్తి రావడంతో అశ్వర్ అక్కడ నుండి పారిపోయాడు. ఆవుపై అత్యాచారంకు ప్రయత్నించిన అశ్వర్ పై 377 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు.