ఆడదంటే అబల కాదు.. సబల అని నిరూపించింది. 15 ఏళ్లుగా తనపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని పొడిచి పొడిచి చంపేసింది. ఇన్నాళ్లూ మౌనంగా అతడి చేష్టలను భరిస్తూ వచ్చిన ఆమె.. ఒక్కసారిగా అపర కాళిక అవతారం ఎత్తింది. మధ్యప్రదేశ్ లోని గుణ పట్టణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అశోక్ నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ (31).. అదే జిల్లాకు చెందిన బ్రిజ్ భూషణ్ శర్మ అనే వ్యక్తిని హత్య చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 25 సార్లు కత్తితో పొడిచింది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు.
అనంతరం నిందితురాలు పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయింది. ఈ సందర్భంగా విచారణలో పలు విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. ఆమెకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 2005లో శర్మ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్పుడు తీసిన వీడియోతో బెదిరించాడు. దీంతో జరిగిన ఘటనను ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకుంది. ఇదే అదనుగా భావించిన శర్మ.. అప్పటినుంచి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. చివరకు ఆమెకు వివాహం జరిగిన ఓ పాప పుట్టినా కూడా అతడు వదలిపెట్టలేదు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేక, ఏం చేయాలో తెలియక మౌనంగా భరిస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆమె భర్త ఊరు వెళ్లాడని తెలుసుకున్న శర్మ.. మరోసారి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. దీంతో ఓపిక నశించిన బాధితురాలు.. ఒక్కసారిగా అపర కాళిలా మారిపోయింది. ఇంట్లో ఉన్న కత్తితో విచక్షణారహితంగా 25 పోట్లు పొడిచింది. అనంతరం అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులకు లొంగిపోయింది.
75138 580171View the following ideas less than and uncover to know how to observe this situation whilst you project your home business today. Earn dollars from home 824086
396610 165505I notice there is undoubtedly lots of spam on this weblog. Do you need assist cleaning them up? I may possibly help between courses! 781099