Switch to English

బిగ్‌బాస్‌ తెలుగు-5 : ఉమా బూతులు, శ్వేత ఆన్‌ ఫైర్‌ – ఎపిసోడ్ -9

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రెండవ వారంలోకి అడుగు పెట్టింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్‌ లతో ఆట ప్రారంభం అయ్యింది. సోమవారం ఎపిసోడ్‌ రచ్చ రచ్చ అయ్యింది. సోమవారం అంటేనే ఎలిమినేషన్ కు నామినేషన్‌. నిన్నటి ఎపిసోడ్‌ లో మెజార్టీ పార్ట్ అదే జరిగింది. అంతకు ముందు వరకు అంతా కలిసి ఉన్నట్లుగా అనిపించినా కూడా ఎలిమినేషన్ టైమ్‌ వచ్చేప్పటికి ఎవరికి వారు అన్నట్లుగా అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన వారినే ఎలిమినేషన్ కు నామినేట్‌ చేయడం ఆశ్చర్యం అనిపించింది. మొత్తానికి బిగ్ బాస్ లో ఎలిమినేషన్ నామినేషన్ మజాను ప్రేక్షకులు సోమవారం ఎపిసోడ్‌ లో ఎంజాయ్ చేశారు. ఉమా దేవి తన వాయిస్ తో బూతులతో ఇంటి సభ్యులను కంగారు పెడితే కొందరు మాత్రం ఆమె తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇక మొత్తంగా బిగ్‌ బాస్ సీజన్ 5 లో రెండవ వారంకు గాను ఏడుగురు సభ్యులు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు.

ఎలిమినేషన్‌ నామినేషన్ పక్రియలో భాగంగా గద్ద మరియు నక్క టీమ్‌ లను ఎంపిక చేయడం జరిగింది. ఈ రెండు టీమ్ ల్లో అటు ఇటు 9 మంది చొప్పున ఉన్నారు. మొత్తం 18 మందిలో ఈసారి ఏడుగురు ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వడంతో ఎవరు వెళ్తారా అనే చర్చ జరుగుతోంది. ఇంతకు ఎలిమినేషన్ లో ఉన్న వారి విషయానికి వస్తే లోబో ను కాస్త అతి చేస్తున్నాడు ఫేక్ గా అనిపిస్తున్నాడు అంటూ నామినేట్‌ చేయడం జరిగింది. ఉమా బూతులు మాట్లాడటంతో పాటు ఎవరైనా ఏమైనా చెప్పేందుకు ప్రయత్నించినా కూడా పట్టించుకోకుండా మాట్లాడేస్తుంది అంటూ ఉమాను కూడా నామినేట్‌ చేశారు. లోబో మరియు ఉమాలతో పాటు ప్రియా, ప్రియాంక, కాజల్‌, నటరాజ్, యానీ మాస్టర్‌ లు నామినేషన్‌ లో ఉన్నారు. ఈ ఏడుగురిలో ఉమా దేవి ఎలిమినేట్‌ అవ్వడం ఖాయం అన్నట్లుగా కనిపిస్తుంది.

ఆమె ఈ వారంలో తన వాయిస్ ను తగ్గించుకోకుంటే మాత్రం తప్పని పరిస్థితుల్లో ఆమె బయటకు వచ్చేయ తప్పదేమో అంటున్నారు. ఇక నామినేషన్ పక్రియలో భాగంగా శ్వేత వర్మ వ్యవహరించిన తీరు మరీ దారుణంగా ఉంది. తాను అమ్మగా భావించే యానీ మాస్టర్ పై కలర్ అంతగా పూయడంను తప్పుబట్టిన శ్వేత వర్మ ఆవేశంతో హమీదాపై రంగును మరీ కొట్టినట్లుగా పూసింది. ఇక లోబో ను కూడా కడిగి పారేసింది. లోబో ఫేక్ అంటూ అతడికి కూడా రంగు కళ్లు ముక్కు నోట్లోకి వెళ్లి పోయేలా పూసింది. హమీదా మరియు లోబోలో బాత్ రూమ్‌ కు వెళ్లి కడుక్కోవాల్సి వచ్చింది. ఇద్దరు కూడా చాలా ఫీల్ అయ్యారు. శ్వేత వర్మ వ్యవహరించిన తీరును అంతా కూడా తప్పుబడుతున్నారు. ఏమాత్రం సహనం లేకుండా ఆమె వ్యవహరించిందని అన్నారు. దాంతో ఆమె వారిద్దరికి కూడా క్షమాపణ చెప్పింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...