Switch to English

మండలి రద్దుపై రఘురామ పోరాటం.. కేంద్రం ఏమంటుందో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాజధాని అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడంలేదు.. కానీ, కేంద్రం ఈ వ్యవహారంపై ఓ కన్నేసి వుంచిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. నిజానికి, రాష్ట్రానికి సంబంధించి కీలక విషయాల్లో కేంద్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఆ వ్యూహాత్మక మౌనాన్ని రాష్ట్రంలోని అధికార వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.

రాజధాని విషయాన్నే తీసుకుంటే, ‘రాజధాని మార్పుతో మాకు సంబంధం లేదు.. అని కేంద్రమే చెప్పింది గనుక.. కేంద్రంతో మా సఖ్యతకు ఇదే నిదర్శనం.. మా నిర్ణయాలకు కేంద్రం మద్దతిస్తోంది..’ అని వైసీపీ ప్రచారం చేసుకుంటున్న విషయం విదితమే. మరి, శాసన మండలిని ఎందుకు రద్దు చేయలేదు.? ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు.? రైల్వే జోన్ ఎందుకు ముందుకు నడవడంలేదు.? పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నిధుల్ని ఇంకా ఎందుకు పెండింగులో వుంచుతోంది.? కడప స్టీలు ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు వ్యవహారాలేమిటి.? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తే మాత్రం.. అధికార వైసీపీ మౌనం దాల్చుతుంటుంది.

ఇదిలా వుంటే, కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకి మంచి పలుకుబడే వుంది. కానీ, అది భేటీల వరకే పరిమితం.. అని పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది. గడచిన ఏడాదిన్నర కాలంలో రఘురామ, కేంద్రానికి చాలా ఫిర్యాదులు చేశారు.. రాష్ట్ర ప్రభుత్వంపైన. వాటిల్లో ఒక్క విషయంలో అయినా రఘురామకి అనుకూలంగా పరిస్థితులు కనిపించాయా.? లేదే.! కానీ, శాసన మండలి రద్దు విషయంలో తాను పార్లమెంటు స్థాయిలో పోరాటం చేస్తానంటున్నరు రఘురామ.

అంతేనా, వైసీపీ తరఫున నిబద్ధత గలిగిన నాయకుడిగా, శాసన మండలి రద్దు కోసం నినదిస్తానన్నారు. గతంలో శాసన మండలి రద్దు దిశగా వైసీపీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. ఆ దిశగా అసెంబ్లీలో తీర్మానం కూడా జరిగింది. శాసన మండలి అంటే ఖర్చు దండగ వ్యవహారం అన్నదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే. అదే జగన్, శాసన మండలికి తమ పార్టీ నుంచి నేతల్ని పంపుతున్నారు.. ప్రత్యేకంగా నామినేట్ చేస్తూ. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానంటూ రఘురామ, ముఖ్యమంత్రికి రాసిన లేఖతో అధికార పార్టీలో చిన్నపాటి కుదుపు కనిపిస్తోంది.

‘మేం ఆ రద్దు విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురాం..’ అని మాత్రమే వైసీపీ సెలవిచ్చింది. ఎవరి భయాలు వాళ్ళవి. రద్దు చేస్తే.. మండలి పదవులు పొందిన నేతల నుంచి వ్యతిరేకత రాకుండా వుంటుందా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...