పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్నది వైసీపీ వాదన. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మరోమారు పిర్యాదు చేశారు వైఎస్సార్సీపీ చీఫ్ విప్ భరత్ మార్గాని (రాజమండ్రి ఎంపీ). గతంలోనే తాము ఓసారి ఫిర్యాదు చేయడంతోపాటు తగిన ఆధారాల్ని కూడా సమర్పించామని వైసీపీ చెబుతోంది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించినందున రఘురామ మీద అనర్హత వేటు వేయాలట.
నిజమే, పార్టీ ఫిరాయించినవారిపై అనర్హత వేటు పడాల్సిందే. అది ఎంపీలకు ఒకలా, ఎమ్మెల్యేలకు ఇంకోలా నిబంధన వర్తింపజేస్తామంటే కుదరదు. టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి దూకేశారు. వాళ్ళంతా టీడీపీపైనా, చంద్రబాబు మీదా దుమ్మెత్తిపోసేశారు. వల్లభనేని వంశీ తదితరులు చంద్రబాబుని తిట్టిన తిట్లతో పోల్చితే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద అంత స్థాయిలో రఘురామ తిట్ల వర్షం కురిపించలేదేమో.
రఘురామ మీద అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసేముందు, వైసీపీలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాల్సి వుందన్న నైతికతను వైసీపీ అధిష్టానం ఎలా విస్మరించిందబ్బా.? ఇదే గురివింద నీతి.. అంటే. చంద్రబాబు హయాంలో వైసీపీ నుంచి టీడీపీలోకి నేతలు దూకేశారు. ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి దూకేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి కూడా దూకుళ్ళు షురూ అయ్యాయి. ప్రస్తుతానికైతే రఘురామ ఏ పార్టీలోనూ చేరలేదు, ఏ పార్టీ తరఫునా వకాల్తా పుచ్చుకోలేదు. అలాంటప్పుడు అది పార్టీ ఫిరాయింపు ఎలా అవుతుంది.?
పార్టీ లైన్ ధిక్కరించారు గనుక, రఘురామను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అధికారం వైసీపీకి వుంటుంది. కానీ, సస్పెండ్ చెయ్యదుగాక చెయ్యదు. పార్టీ నుంచి రఘురామని వైసీపీ సస్పెండ్ చేస్తే, రఘురామకి మరింత స్వేచ్ఛ లభిస్తుంది. ఆ తర్వాత రఘురామ మరింతగా చెలరేగిపోయే అవకాశముందన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భయంలా కనిపిస్తోంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ టీడీపీ ఎంత మొత్తుకుంటున్నా అసెంబ్లీ స్పీకర్ పట్టించుకోవడంలేదాయె. అలాంటప్పుడు లోక్ సభ స్పీకర్ మాత్రం రఘురామ విషయమై వైసీపీ వాదనను ఎలా సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంటారు.?
490892 202701Thanks for blogging and i enjoy the weblog posting so no public comments.,,,,,,,,,,, 543703
619596 377202Hey there! Wonderful post! Please do tell us when we shall see a follow up! 359380