జగన్ తన ఢిల్లీ పర్యటన అనంతరం ఎప్పుడూ ఆ వివరాలను మీడియాకు ఇవ్వరు. అయితే.. ఆయన తరపున సీఎంవో, ఇతరుల నుంచి ప్రకటనలు వస్తాయి. ఈ నేపథ్యంలో జగన్ జనవరి 19న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఆ వెంటనే పెరిగిన పోలవరం అంచనాలను ఆమోదించాలని కోరినట్టు ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఆ విషయం అబద్ధమని తేలింది. అటువంటి మెమొరాండం హోంశాఖకు ఇవ్వలేదని పార్లమెంట్లో జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్ లాల్ చెప్పారు.
ఈరోజు పార్లమెంట్లో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కోరిన వివరాలపై జలశక్తి మంత్రి ఈ విధంగా స్పందించారు. సీఎం జగన్ జనవరి 19న, ఫిబ్రవరి 19న అమిత్ షాను కలిశారని, పోలవరంకు సంబంధించి పెరిగిన అంచనాలను కేంద్రం ఆమోదించాలని ఆయన కోరారు. దీనికి సమాధానంగా జలశక్తి సహాయం మంత్రి రతన్ లాల్.. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని, మెమొరాండం కూడా జగన్ ఇవ్వలేదని చెప్పారు.
603454 435729you use a great blog here! do you wish to have the invite posts in my small weblog? 793148