కొత్త కారు కొనుక్కోవాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం ఓ ఆఫర్ తీసుకొచ్చింది. తుక్కు విధానం కింద పాత వాహనాన్ని ఇస్తే.. కొత్త వాహనంపై 5 శాతం రాయితీ లభిస్తుందని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇటీవల బడ్జెట్ లో స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ల తర్వాత ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.
అలాగే వాహన యజమానులు తమ పాత వాహనాలను స్వచ్ఛందంగా వదిలించుకునేలా ప్రోత్సహించేందుకు కొత్త వాహనాల కొనుగోలుపై 5 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. అదే సమయంలో ఫిట్ నెస్ వాహనాలను వినియోగిస్తే భారీ జరిమానాలు, శిక్షలు కూడా విధిస్తామని గడ్కరీ హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో వాహన ఫిట్ నెస్ పరీక్షా కేంద్రాలను దేశవ్యాప్తంగా నెలకొల్పుతామని తెలిపారు. కొత్త విధానం వల్ల దేశీయ వాహన పరిశ్రమ రూ.4.5 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
849941 875954Yay google is my king aided me to uncover this outstanding internet site! . 188226
767242 14425Incredible! This weblog looks just like my old 1! It is on a entirely different subject but it has pretty significantly the same layout and style. Wonderful choice of colors! 70798