Switch to English

పోలవరం రగడ: జగన్‌పై ఉండవల్లి సెన్సేషనల్‌ కామెంట్స్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పోలవరం ప్రాజెక్టు ఎత్తు ముందు అనుకున్న స్థాయిలోనే వుండబోతోందా.? నీటి నిల్వ సామర్థ్యం ఎంత.? పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఆలోచన ఏంటి.? రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటోంది.? కేంద్రం చెబుతున్న మాటల్లో నిజమెంత.? రాష్ట్రం చెబుతున్న మాటల్లో విశ్వసనీయత ఎంత.? పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకమన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, జగన్‌తో దోస్తీ కోసం.. రాజీ పడ్డారా.? లేదంటే, కేసీఆర్‌కి భయపడి, ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా పోలవరం ప్రాజెక్టుని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఎత్తు తగ్గించి నిర్మిస్తోందా.? ఇలా చాలా ప్రశ్నలు. ఏ ప్రశ్నకీ సరైన సమాధానం దొరకడంలేదు.

‘ప్రాజెక్టు పూర్తయ్యాక.. వచ్చి టేపుతో కొలుచుకోండి..’ అంటూ వెటకారపు విమర్శలు చేస్తున్నారు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. ప్రాజెక్టుల ఎత్తుల్ని టేపులతో ప్రజలు కొలుచుకునే దుస్థితి నిజంగానే వస్తుందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఏమో, ఆ రోజు కూడా వచ్చేస్తుందేమో. ఇక, ఈ వ్యవహారాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో గోదావరి నదిపై కేసీఆర్‌ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తోంటే, వాటి ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌ వెళ్లడం చారిత్రక తప్పిదమని ఉండవల్లి ఆరోపించారు. ‘ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ముఖ్య నేతలకు ఆస్తులన్నీ తెలంగాణలోనే వున్నాయి. అదే అసలు సమస్య. కేసీఆర్‌కి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు వెళ్ళిల్సి వస్తుంది..’ అంటూ గతంలో అధికారంలో వున్న టీడీపీపైనా, ప్రస్తుతం అధికారంలో వున్న వైసీపీపైనా మండిపడ్డారు ఉండవల్లి.

నిజానికి, ఈ వాదనలో కొంత నిజం లేకపోలేదు. లేకపోతే, పోలవరం ప్రాజెక్టు ఎత్తుని తగ్గించేందుకు వైఎస్‌ జగన్‌ అంగీకరించారంటూ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ ఎలా చెప్పగలుగుతారు.? గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టేసింది. కానీ, దానికి ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం పెట్టలేకపోయింది సమర్థవంతంగా. కానీ, ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి అయిన పోలవరం విషయంలో తెలంగాణ అభ్యంతరాలు పెడుతూనే వుంది.

ఇవన్నీ ఓ ఎత్తు.. ప్రాజెక్టు ఎత్తు పూర్తిస్థాయిలో వుండాలంటే, నీటి నిల్వ పూర్తిగా వుండాలంటే.. పునరావాస ప్యాకేజీ విషయమై కేంద్రం, సానుకూలంగా స్పందించాలి. 55 వేల కోట్ల రూపాయల అంచనాల్ని కేంద్రం ఆమోదించాలి.. అందుకు తగ్గ నిధులు అందించాలి. ఆమోదం వంటివి ప్రాథమికంగా జరిగిపోయినా, కొర్రీలు షురూ అయ్యాయి. ఆ కారణంగానే ఎత్తు తగ్గించి, నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేయాలని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చూస్తోందన్నది ఓ ఆరోపణ.

ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన విషయం. ఉండవల్లి విమర్శించారని కాదుగానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ‘హక్కు’ అయిన పోలవరం విషయంలో అస్సలు రాజీపడకూడదు. దురదృష్టవశాత్తూ గతంలో టీడీపీ రాజీ పడింది.. ఇప్పుడు వైసీపీ రాజీపడుతోంది.. రాష్ట్రం భవిష్యత్తు కేంద్రం వద్ద తాకట్టుపెట్టబడుతోంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...