Switch to English

గ్రేటర్‌ సిత్రం: ‘టిక్కె’ పెట్టినా ఓటేసినట్లేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

గ్రేటర్‌ ఎన్నికల్లో సిత్రాలు అన్నీ ఇన్నీ కావయా.! బ్యాలెట్‌ విధానంలో ‘స్వస్తిక్‌’ ముద్రని, అభ్యర్థికి కేటాయించిన ఎన్నికల గుర్తు మీద వేస్తేనే, అది ఓటు వేసినట్లు లెక్క. కానీ, పెన్నుతో టిక్కు పెట్టినాసరే ఓటు వేసినట్లేనట. స్వస్తిక్‌ ముద్ర కాకుండా ఇంకే ముద్రని వినియోగించినా అది ఓటు వేసినట్లే పరిగణిస్తారట. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం కౌంటింగ్‌ జరుగుతుండగా, నిన్న రాత్రి ‘వింత’ ఉత్తర్వులు వెలువడ్డంపై వివిధ రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాత్రికి రాత్రి అధికార టీఆర్‌ఎస్‌, ఎన్నికల కమిషనర్‌తో కుమ్మక్కయి.. ఈ రోజు వెల్లడయ్యే ఫలితాల్ని తారుమారు చేసేందుకు కుట్ర పన్నిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది భారతీయ జనతా పార్టీ.

గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ విషయమై నగరవాసి అంతగా ఆసక్తి చూపలేదన్నది తెల్సిన విషయమే. సాయంత్రం 5 గంటల వరకు 36 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదయ్యింది. అయితే, చివరి గంటలో దాదాపు 9 శాతం ఓటింగ్‌ నమోదయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. ఇదెలా సాధ్యం.? అని రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పైగా, చాలా పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 5 తర్వాత, 6 గంటల మధ్య కూడా పెద్దగా ఓటర్లు, క్యూ లైన్లు కనిపించని పరిస్థితి. ఏమో, ఏం మ్యాజిక్‌ జరిగిందోగానీ.. గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ అయితే, గత దఫా పోలింగ్‌ కంటే కాస్త ఎక్కువే నమోదయ్యింది. అదే సవాలక్ష అనుమానాలకు తావిస్తోంటే, ఇప్పుడు ఈ ‘పెన్నుతో టిక్కు.. ఏ ముద్ర అయినా ఓకే..’ అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో కొత్త అనుమానాలు షురూ అయ్యాయి.

ఈ అనుమానాల చుట్టూ రాజకీయ దుమారం మరింత తీవ్రతరం కాబోతోందన్నది నిర్వివాదాంశం. ‘మేం కోర్టును ఆశ్రయించేందుకు కూడా వీలు లేకుండా, పక్కా ప్లానింగ్‌తో అర్థరాత్రి అభ్యంతరకర ఉత్తర్వులు ఇచ్చారు..’ అంటూ బీజేపీ నేత బండి సంజయ్‌, రాష్ట్ర ఎన్నికల సంఘంపైనా, అధికార టీఆర్‌ఎస్‌పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....