Switch to English

బిబి4 ఎపిసోడ్-18: రోబో అభి ప్లాన్‌, దివి కిడ్నాప్‌తో రచ్చ రచ్చ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

మొన్నటి ఎపిసోడ్‌ లో ప్రారంభం అయిన రోబోలు మనుషుల టాస్క్‌ నిన్నటి ఎపిసోడ్‌ లోనూ కంటిన్యూ అయ్యింది. నిన్నటి ఎపిసోడ్‌ కు దివి కిడ్నాప్‌ హైలైట్‌ గా నిలిచింది. రోబోల టీం ఎట్టి పరిస్థితుల్లో చార్జింగ్‌ పెట్టుకోవాలని ప్రయత్నించారు. కాని మనుషులు మాత్రం ఎంతటి అవసరం అయినా కూడా చార్జింగ్‌ పెట్టేందుకు ఒప్పుకోవడం లేదు. టాయిలెట్‌ వస్తే ఏదోలా కానిచ్చేస్తున్నారు తప్ప రోబోలకు చార్జింగ్‌ ఇచ్చేందుకు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు.

అలాంటి సమయంలో రోబో టీంలో ఉన్న అభి మనుషుల టీంలో ఉన్న ఒక అమ్మాయిని కిడ్నాప్‌ చేయాలని ప్లాన్‌ ఇచ్చాడు. మొదట అందుకు అందరు నో చెప్పినా ఆ తర్వాత ఒప్పుకున్నారు. అమ్మాయిలను ఎవరిని అయినా లోనికి తీసుకు రావాలని భావించారు. మొదట గంగవ్వ తాను ఎవరినో ఒకరిని తీసుకు వస్తానంటూ చెప్పి వెళ్లింది. ఆమె ఎంత చెప్పినా ఎవరు వినలేదు. అప్పటికే మోనాల్‌ కాకుండా అంతా పడుకుని ఉన్నారు.

కొద్ది సమయం తర్వాత అభిజిత్‌ వచ్చి మెల్లగా మాటలు కలిపి అమ్మాయిలకు మేము యాక్సస్‌ ఇవ్వాలనుకుంటున్నాం. వారు ఇబ్బంది పడుతుంటే వెళ్ల వచ్చు అభి అన్నాడు. ఆ సమయంలో నిద్రలోంచి లేచిన దివి బాత్‌ రూంకు వెళ్లాలనుకుంది. అప్పుడు అభి తెలివిగా లోని బాత్‌ రూంలోకి తీసుకు వెళ్లాడు. ఆమెను బాత్‌ రూంలోకి వెళ్లనిచ్చారు. ఆమె రావడమే ఆలస్యం అమ్మాయిలు అంతా కూడా ఆమెను పట్టేసుకున్నారు. అభి చార్జింగ్‌ పెట్టుకున్నారు. దివికి బలవంతంగా అన్నం తినిపించారు. బాత్‌రూం యాక్సిస్‌ ఇచ్చినందుకు అభి చార్జ్‌ పెట్టుకున్నాడు. అన్నం పెట్టినందుకు గాను హారిక చార్జ్‌ పెట్టుకుంది.

దివి లోపల ఉన్న సమయంలో మనుషుల టీం సభ్యులు అయిన మెహబూబ్‌, అఖిల్‌, సోహెల్‌, సుజాత, అమ్మ రాజశేఖర్‌, మోనాల్‌, సోహెల్‌ లు రోబోల టీం సభ్యులను బండ బూతులు తిట్టారు. డోర్‌ క్లోజ్‌ ఉండటంతో వారు లోనికి రాలేక పోయారు. డోర్‌ తీయమంటూ ఇష్టానుసారంగా మాట్లాడారు. సోహెల్‌ అఖిల్‌ లు అమ్మాయిని అడ్డు పెట్టుకుని ఆట ఆడేస్తున్నారు అంటూ తిట్టినా కూడా రోబో టీం సభ్యులు మాత్రం పట్టించుకోకుండా వారి పని వారు చేసుకున్నారు. ఆ తర్వాత దివిని వదిలేశారు.

రెండు టీమ్‌ ల మద్య రచ్చ రచ్చ గొడవ జరిగింది. అభిజిత్‌ ను వెన్ను పోటు పొడిచాడు అని అమ్మాయిని అడ్డు పెట్టుకుని గేమ్‌ ఆడారు అంటూ ఇష్టానుసారంగా అనేశారు. నేడు కూడా అదే గేమ్‌ కొనసాగబోతుంది. నేటితో ఆ గేమ్‌ పూర్తి అయ్యే అవకాశం ఉంది. రెండు టీమ్‌ లు కూడా హోరా హోరీగానే ఆటను కొనసాగించి ప్రేక్షకులకు మస్త్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఇచ్చారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...