Switch to English

ఈఎస్ఐ కుంభకోణం.. రూ.4.47 కోట్లు స్వాధీనం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో అవినీతి రూపేణా ఆర్జించిన కట్టల కట్టల నోట్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల రూ.1.10 కోట్ల నగదు లంచంగా తీసుకుంటూ కీసర తహశీల్దార్ నాగరాజు పట్టుబడిన విషయం చూసి జనాలు నోరెళ్లబెట్టారు. ఒక్కసారిగా అన్ని నోట్ల కట్టలు చూసి అవాక్కయ్యారు. తాజాగా అంతకుమించిన నోట్ల కట్టలు వెలుగుచూశాయి. ఈసారి వంతు ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టు అయిన ఇండియన్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ దేవికారాణిది కావడం విశేషం. ఆమె అక్రమమార్గంలో సంపాదించిన రూ.4.47 కోట్ల నగదను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది.

ఈఎస్ఐకి సంబంధించిన మందుల కొనుగోళ్లలో భారీఎత్తున అవకతవకలకు పాల్పడి కోట్లు కూడబెట్టిన ఆరోపణలపై దేవికారాణిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు డాక్టర్లు సహా పలువురు ఈఎస్ఐ సిబ్బంది, ఫార్మా కంపెనీల డైరెక్టర్లు అరెస్టయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు తాజాగా దేవికారాణికి చెందిన రూ.4.47 కోట్ల నగదును ఓ రియల్టర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ రెసిడెన్షియల్ వెంచర్ లో 6 ప్లాట్లతోపాటు 15వేల అడుగులు వాణిజ్యస్థలం నిమిత్తం ఆ మొత్తాన్ని దేవికారాణి పెట్టుబడిగా పెట్టినట్టు గుర్తించారు. ఇందులో దేవికారాణి వాటా రూ.3.75 కోట్లు కాగా, ఇదే కేసులో అరెస్టు అయిన ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి వాటా రూ.72 లక్షలుగా నిర్ధారించారు. ఈ మొత్తం లెక్కల్లో లేని నగదేనని తేలింది. ఈ మొత్తంలో 2.29 కోట్లు చెక్కులు, ఆన్ లైన్ బదిలీ ద్వారా చెల్లించగా.. రూ.22 లక్షలు బినామీదార్ల పేరిట చెల్లించినట్టు కనుగొన్నారు.

ఆధారాలతో సహా సదరు రియల్టర్ కు నోటీసులు ఇవ్వడంతో తనకు దేవికారాణి చెల్లించిన మొత్తం రూ.4.47 కోట్లను ఏసీబీకి అప్పగించాడు. కాగా, నకిలీ బిల్లులు, తప్పుడు రికార్డులు ద్వారా భారీ ఎత్తున మందులు కొనుగోళ్లు జరిపినట్టు పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఖజానా నుంచి రూ.11.69 కోట్ల మేర నగదును స్వాహా చేసినట్టు ఏసీబీ నిగ్గు తేల్చింది. ఈ మొత్తం కుంభకోణంలో దాదాపు రూ.300 కోట్ల మేర అవకతవకలు జరిగి ఉంటాయని ఏసీబీ తొలుత అంచనా వేయగా.. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఆ మొత్తం రూ.10 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు నిర్ధారించింది.

తాజాగా దీనికి సంబంధించిన నాలుగున్నర కోట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఇంకా ఎక్కడైనా ఇలాంటి లావాదేవీలు జరిగాయా అనే అంశంపై దృష్టి సారించారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...