Switch to English

న్యాయ వ్యవస్థపై కుట్రలట.. ఇదెక్కడి ‘న్యాయం’.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆషామాషీ ఆరోపణ కాదు. అత్యంత తీవ్రమైన అంశమిది. ఏకంగా న్యాయ వ్యవస్థ మీద కుట్రలు జరుగుతున్నాయంటూ ఓ కథనాన్ని టీడీపీ అనుకూల మీడియా వండి వడ్డించింది. మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య నేతృత్వంలో కథ నడుస్తోందన్నది సదరు కథనం సారాంశం. బీసీ వర్గాలకు చెందిన ఈశ్వరయ్య, ఇటీవల రాష్ట్ర హైకోర్టు మీద ఆరోపణలు చేయడం, ఆ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుండడం, ఇదంతా కుట్ర కోణంలోనే జరుగుతోందన్న విమర్శలు రావడం తెల్సిన విషయాలే. కరోనాకీ, హైకోర్టు కార్యకలాపాలకు లింకు పెట్టి న్యాయ వ్యవస్థలోని కీలక వ్యక్తులపై ఆరోపణలు చేయడం పెను దుమారం రేపింది.

ఇదిలా వుంటే, చిత్తూరు జిల్లాకి చెందిన రామకృష్ణ అనే న్యాయమూర్తి (సస్పెన్షన్‌లో వున్నారు), తాజా పరిణామాలపై హైకోర్టును ఆశ్రయించారు. న్యాయ వ్యవస్థపై కుట్ర జరుగుతోందని పేర్కొంటూ, అందుకు సంబంధించిన కొన్ని ఆడియో టేపుల్నీ న్యాయస్థానానికి సమర్పించడం గమనార్హం. ఈశ్వరయ్యతోపాటు, మరో మాజీ న్యాయమూర్తి నాగార్జున రెడ్డిలపై ఆరోపణలు చేశారు.

అధికార వైసీపీ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తోందనీ, ఈ ఎపిసోడ్‌లో ఈశ్వరయ్య అత్యంత కీలక భూమిక పోషిస్తోందనీ, ఢిల్లీ స్థాయిలో న్యాయ వ్యవస్థపై ఈశ్వరయ్య అండ్‌ టీమ్ కుట్రలు పన్నుతోందని రామకృష్ణ ఆరోపిస్తుండడం గమనార్హం. తాను చాలామందికి ఓపెన్‌ కేటగిరీలో నియామకాలు జరిపినట్లు ఈశ్వరయ్య తనతో చెప్పారంటున్నారు రామకృష్ణ. ఇదంతా నిజమేనా.? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఉన్నది విద్యా శాఖ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేస్తోన్న ఈశ్వరయ్య నిజంగానే న్యాయ వ్యవస్థ కుట్రపన్నుతున్నారా.? ఆయనకు ఆ స్థాయి వుందా.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

న్యాయ వ్యవస్థలోని వ్యక్తులపై ఈ తరహా ఆరోపణలు గతంలోనే వచ్చినా, ఇవి అత్యంత తీవ్రమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ విషయంపై స్పందిస్తూ, ‘సదరు కథనాలు వాస్తవం అయితే ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేలాలి. ఒకవేళ నిజం కాని పక్షంలో, ఈ తరహా కథనాల్ని వండి వడ్డించినందుకు ఆయా మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి..’ అంటూ జనసేన నేత, ఆ పార్టీ లీగల్‌ వింగ్‌ నాయకుడు శాంతి ప్రశాంద్‌ సింగలూరి ట్విట్టర్‌ వేదికగా అభిప్రాయపడ్డారు. ‘జడ్జిలు కూడా ప్రలోభాలకు అతీతం కాదు అనేద ఇప్పటివరకు కేవలం కొందరు మాత్రమే అభిప్రాయపడేవారు.

కానీ, ఇప్పుడు వెలుగు చూస్తున్న అంశాల నేపథ్యంలో సామాన్యల్లోనూ అదే భావన కలిగితే అది ఈ వ్యవస్థ ఉనికికే గొడ్డలి పెట్టు.. కాబట్టి, ఈ విషయంలో న్యాయ వ్యవస్థ స్పందించి, ఇలాంటి రుగ్మతలకు ప్రబలకుండా నిర్మూలన చేయడమే కాదు, ఇలాంటివి జరగకుండా కఠినమైన, చట్టపరమైన చర్యలు వుండాలని కోరుకుంటున్నాము..’ అని శాంతి ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...