బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. బాలీవుడ్ సినీ ప్రముఖులపై ఈమె చేసే వ్యాఖ్యలతో చాలా మంది విరోధులను కూడగట్టుకుంది. ఇటీవలే కంగనా రనౌత్ సీఎం ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆధిత్య ఠాక్రే పై కూడా వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ ఆత్మహత్య కేసును ఆయన ప్రభావితం చేస్తున్నాడేమో అంటూ కంగనా అనుమానం వ్యక్తం చేసింది. బాలీవుడ్ ప్రముఖులకు ఆయన సన్నిహితుడు. అందుకే ఆయన పోలీసులను ప్రభావితం చేస్తున్నాడేమో అంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది.
ఈ సమయలోనే శుక్రవారం రాత్రి సమయంలో తుపాకీ కాల్పులు వినిపించడంతో చర్చనీయాంశంగా మారింది. కొన్ని సెకన్ల గ్యాప్లో రెండు సార్లు తుపాకీ పేళింది. మొదట ఈ కాల్పులను వేరు అనుకున్నప్పటికి కంగనాను టార్గెట్ చేసి ఆమెను బెదిరించే ఉద్దేశ్యంతోనే ఈ పని చేసి ఉంటారు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంగనా ఇంటికి అతి సమీపంలో ఇది జరిగింది. ఇక కంగనా ఈ బెదిరింపులపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడినది.
సీఎం కొడుకు గురించి నేను చేసిన వ్యాఖ్యల కారణంగానే ఈ బెదిరింపులు. సుశాంత్ ఆత్మహత్యకు ముందు కూడా ఇలా తుపాకితో బెదిరించి ఉంటాడేమో అంటు అనుమానం వ్యక్తం చేసింది. కరణ్ జోహార్కు ఆప్తుడు అయిన ఆ సీఎం తనయుడు మిత్రుడిపై నేను చేస్తున్న ఆరోపణలకు ఇలా బెదిరించాడేమో అంది. ముఖ్యమంత్రి కుమారుడిని బేబీ పెంగ్విన్ అంటూ సంభోదిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ బెబీ పెంగ్విన్ కవ్వించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు నేను భయపడను.
ఒక వేళ నేను నా రూంలో ఉరి వేసుకుని కనిపించినా అది నా ఆత్మహత్య కాదని అంతా భావించాలి. నన్ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానంను కూడా కంగనా వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటి వరకు బాలీవుడ్ వారిని వరకే టార్గెట్ చేసిన కంగనా ఇప్పుడు ఏకంగా సీఎం కొడుకునే ఢీ కొట్టడంతో ఆమె మరింతగా డేంజర్లో ఉన్నట్లుగా ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.