Switch to English

సిగ్గు సిగ్గు: పవన్‌ కళ్యాణ్‌పై ‘పచ్చ మీడియా’ ఏడుపు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

మూడు రాజధానుల ఎపిసోడ్‌ ‘పచ్చ మీడియా’లోని ఓ ప్రముఖ మీడియా సంస్థకి అస్సలేమాత్రం మింగుడుపడ్డంలేదు. ఇక్కడో ఆసక్తికరమైన విషయమేంటంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి.. పవన్‌ కళ్యాణ్‌ని ప్రశ్నిస్తోంది ‘పచ్చ మీడియా’. ఓ మీడియా సంస్థని స్థాపించి, దాంట్లోంచి బయటకు వచ్చి ‘పచ్చ మీడియా’లో మళ్ళీ చేరిన ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌.. తన ‘ఊసరవెల్లి’ అవతారాన్ని బయటపెట్టేసుకున్నాడు. గతంలో మూడు రాజధానులకు మద్దతిస్తూ.. తన సొంత మీడియా ఛానల్‌లో ఉపన్యాసం దంచేసిన సదరు సీనియర్‌ జర్నలిస్టు, ఇప్పుడు మూడు రాజధానులపై భగ్గుమంటున్నాడు.. ఈ క్రమంలో ‘పవన్‌ కళ్యాణ్‌ సమాధానం చెప్పాలి..’ అంటూ బీభత్సమైన కామెడీ చేశాడు. అక్కడికేదో సదరు జర్నలిస్టుకి అమరావతిలో ఓ వెయ్యి ఎకరాలున్నట్టు.. దాన్ని ప్రభుత్వమో, పవన్‌ కళ్యాణో స్వాధీనం చేసుకున్నట్లూ ఆవేశంతో ఊగిపోయాడు.

నిజానికి, అమరావతి విషయంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మొదటి నుంచీ ఖచ్చితమైన అభిప్రాయంతో వున్నారు. ‘ప్రభుత్వానికి భూములు ఇచ్చే క్రమంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి..’ అని రైతులకు సలహా ఇచ్చారు. ‘ప్రభుత్వాలు మారితే, ఒప్పందాలు రద్దయ్యే పరిస్థితి వుండకూడదు.. ఆ దిశగా స్పష్టత తీసుకున్నాకే భూములు ఇవ్వాలి..’ అని రైతుల్ని ఎడ్యుకేట్‌ చేసే ప్రయత్నం చేశారు. ‘ప్రభుత్వం, రైతుల త్యాగాన్ని వృధా కానీయకూడదు.. ప్రభుత్వం మారినాసరే.. ప్రభుత్వంతో రైతులు చేసుకున్న ఒప్పందాలకు చట్టబద్ధత వుండాలి..’ అని అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికీ అల్టిమేటం జారీ చేశారు. అప్పట్లో కొందరు టీడీపీ మద్దతుదారులు పవన్‌ కళ్యాణ్‌పై అమరావతిలోనే రాళ్ళేశారు. ఇప్పుడు మళ్ళీ పవన్‌ కళ్యాణ్‌ మీదనే టీడీపీ దాడి షురూ అయ్యింది.

సోషల్‌ మీడియాలో నిన్న సాయంత్రం నుంచి పడ్డ ట్వీట్లు చూస్తే, అందులో మేగ్జిమమ్ ట్వీట్లు పవన్‌ కళ్యాణ్‌ మీదనే కావడం గమనార్హం. పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీకి వున్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే.. ఆ ఎమ్మెల్యే కూడా పార్టీకి దూరంగా వుంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సమాధానం చెబితే, మూడు రాజధానులు ఆగిపోతాయా.? నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది ‘పచ్చ మీడియా.. అలాగే పచ్చ పార్టీ’ తీరు. ‘అమరావతినే రాజధానిగా కొనసాగించాలి..’ అని బీజేపీ చెబుతోంది. ‘అమరావతికి జనసేన కట్టుబడి ఉంది..’ అని జనసేన నేతలు చెబుతున్నారు. టీడీపీకి చెందిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే మాత్రం ‘అయ్యిందేదో అయిపోయింది.. విశాఖ విషయంలో వ్యతిరేకత అనవసరం..’ అని నినదిస్తున్నారాయె. పచ్చ పార్టీనో, పచ్చ మీడియానో.. తొలుత ప్రశ్నించుకోవాల్సింది తమను తామే. ఆ తర్వాతే, ఇతరుల జోలికి వెళ్ళాల్సి వుంటుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...