Switch to English

వైఎస్‌ జగన్‌కి రఘురామ తాజా లేఖాస్త్రం.. ఈసారి ‘పీవీ’ కోటా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు, సొంత పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆయా అంశాలపై ప్రభుత్వానికి లేఖాస్త్రాలు సంధిస్తూ వస్తోన్న ఈ నర్సాపురం ఎంపీ, అట్నుంచి మాత్రం ‘సానుకూల స్పందన’ పొందలేకపోతున్నారు. అయితే, అధికార పార్టీలో రఘురామ లేఖాస్త్రాలు మాత్రం ‘ప్రకంపనలు’ సృష్టిస్తూనే వున్నాయి. ఇసుక విషయంలోనూ, ఇతరత్రా కొన్ని విషయాల్లో రఘురామ లేఖాస్త్రాలు సరిగ్గానే పనిచేశాయా.? అంటే, ఆయన ‘అవును’ అనే భావిస్తున్నారనుకోండి.. అది వేరే విషయం.

ఇక, తాజాగా రఘురామ సంధించిన లేఖాస్త్రానికి ‘పీవీ’ అనే పూత పూశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పీవీ నరసింహారావు అంటే.. తెలుగు జాతి ఆరాధ్య దైవం అనే భావన చాలామందిలో వుంది. మన తెలుగు నేల నుంచి జాతీయ స్థాయికి ఎదిగి, దేశ ప్రధానిగా సేవలందించిన మహనీయుడు.. అంటూ వీపీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నామిప్పుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు పీవీ నరసింహరావు. ‘పీవీ అంటేనే తెలుగు ఠీవి..’ అన్నట్లుగా ఇప్పుడు పీవీ గురించిన చర్చ తెలుగు నాట చాలా చాలా గట్టిగా జరుగుతోంది. అందుక్కారణం, తెలంగాణ ప్రభుత్వమే.

పీవీ, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? తెలంగాణకు చెందిన వ్యక్తి అయినా.. ఉమ్మడి రాష్ట్రం నుంచి రాజకీయంగా ఎదిగిన ఆయన, రెండు తెలుగు రాష్ట్రాలకూ గర్వకారణమే. ఈ విషయాల్ని ప్రస్తావిస్తూ, క్యాబినెట్‌ భేటీలో పీవీ శత జయంతి ఉత్సవాలపై సముచిత నిర్ణయం తీసుకోవాలని కోరారు రఘురామకృష్ణరాజు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి పీవీ అంటే ఎంతో గౌరవం వుండేదనీ, హైద్రాబాద్‌లో పీవీ గౌరవార్ధం ఘాట్‌ నిర్మించింది వైఎస్సార్‌ హయాంలోనేనని రఘురామకృష్ణరాజు, వైఎస్‌ జగన్‌కి రాసిన లేఖాస్త్రంలో ప్రస్తావించారు.

ఇది నిజంగానే పెద్ద సంకటం వైఎస్‌ జగన్‌కి. రఘురామ లేఖ రాసిన దరిమిలా, ఆ దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందా.? అసలు పీవీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టించుకుంటుందా.? లేదా.? వేచి చూడాల్సిందే. పట్టించుకుంటే మాత్రం.. రఘురామకృష్ణరాజు సూపర్‌ విక్టరీ కొట్టినట్లే.

వైఎస్‌ జగన్‌కి రఘురామ తాజా లేఖాస్త్రం.. ఈసారి ‘పీవీ’ కోటా.! వైఎస్‌ జగన్‌కి రఘురామ తాజా లేఖాస్త్రం.. ఈసారి ‘పీవీ’ కోటా.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...