Switch to English

జనసేనాని ఇంటర్వ్యూ.. జగన్‌ సర్కార్‌పై ప్రశంసలు, ప్రశ్నాస్త్రాలూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో కన్పించారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన తనదైన శౖలిలో స్పందించారు. ఘాటైన విమర్శలకు దూరంగా.. అత్యంత బాధ్యతాయుతంగా పలు అంశాలపై తన అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టారు. చాతుర్మాస దీక్ష గురించీ, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల గురించీ, రాజధాని అమరావతి గురించీ, రాష్ట్రాన్ని కుదిపేస్తోన్న ఇళ్ళ వ్యవహారం గురించీ పవన్‌ కళ్యాణ్‌ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయనేం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

ప్రజా జీవితంలో వున్నాను కాబట్టే.. చాతుర్మాస దీక్ష గురించి అందరికీ తెలిసింది..

ఎన్నో ఏళ్ళుగా చాతుర్మాస దీక్ష చేస్తున్నాను. అయితే, ఇప్పుడు ప్రజా జీవితంలో వున్నాను గనుక, దాని గురించి అందరికీ తెలుస్తోంది. సాత్విక ఆహారం తీసుకోవడం.. నేలపైనే పడుకోవడం.. చాతుర్మాస దీక్షలో ముఖ్యమైన విషయాలు.

కట్టేసి వున్న ఇళ్ళు ఇవ్వడంలో ప్రభుత్వానికి ఏంటి అభ్యంతరం.?

కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు పది లక్షల ఇళ్ళ నిర్మాణానికి సహకరించింది. మరో మూడు లక్షల ఇళ్ళు నిర్మాణం కావాల్సి వుంది. భూమి లభ్యత తగ్గినప్పుడు వున్న స్థలంలోనే నిటారుగా ఫ్లాట్లు నిర్మించి, వాటిటిని పేదలకు కేటాయించాల్సి వుంది. చాలా జిల్లాల్లో పలు అంశాలపై తిరిగినప్పుడు, ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆయా ఇళ్ళ నిర్మాణాలు చూపించి, వాటిని కేటాయించలేదంటూ నా వద్ద మొరపెట్టుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమిని సేకరించడం కష్టసాధ్యమైన పని. కొందరి దగ్గర భూమిని లాక్కుని, ఇంకొకరికి పంచాలనుకోవడం సబబుకాదు. ఈ క్రమంలో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్టేసి వున్న ఫ్లాట్లను పేదలకు ఇవ్వడంలో ప్రభుత్వం బేషజాలకు పోవడం అస్సలేమాత్రం మంచిది కాదు.

అమరావతికి అప్పుడు ఒప్పుకుని, ఇప్పుడు మాట మార్చేస్తే ఎలా.?

‘మేం ఒక రాజధానికి వ్యతిరేకం, మూడు రాజధానులకు అనుకూలం’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గతంలోనే చెప్పి వుంటే, ఇప్పుడు ఆ పార్టీని ప్రశ్నించడానికి వీల్లేదేమో. కానీ, అమరావతి విషయంలో అన్ని రాజకీయ పార్టీలూ ఒప్పుకున్నాయి. ఈ క్రమంలోనే రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చింది. రెండు మూడు వేల ఎకరాల భూములు సరిపోయే రాజధాని కోసం, 30 వేల ఎకరాలు సేకరించడం కూడా సబబు కాదు. సింగపూర్‌ మోడల్‌ అని చెప్పి అమరావతిని చంద్రబాబు ప్రభుత్వం అమ్మేస్తే, ఇప్పుడు మూడు రాజధానులంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమ్మేస్తోంది.! అంతిమంగా నష్టపోతున్నది రైతులు మాత్రమే.

దళితులపై దాడులు అమానుషం

రాష్ట్రంలో ఓ దళిత మహిళ హోంమంత్రిగా వున్నారు. కానీ, దళితులపై రోజురోజుకీ దాడులు పెరిగిపోతున్నాయి. డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ప్రభుత్వం, మిగతా కేసుల్లో ఎందుకు అంత వేగంగా స్పందించడంలేదు.? ఇది చాలా కీలకమైన అంశం. ప్రభుత్వం తక్షణం నిందితులపై కరిÄన చర్యలు తీసుకోవాలి. వరుసగా దళితులపై జరుగుతున్న దాడులు నన్ను కలచివేస్తున్నాయి.

కరోనా టెస్టులు ఎక్కువ చేయడం అభినందనీయమేగానీ..

కరోనా వైరస్‌ టెస్టులు ఎక్కువగా చేస్తున్నందున ప్రభుత్వాన్ని అభినందించాం. మనస్పూÛర్తిగా చేసిన అభినందన అది. అయితే, ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక బాధితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలి. కరోనా వ్యాప్తి విషయంలో ప్రభుత్వాన్ని తప్పు పట్టలేం. ప్రపంచానికే ఈ పరిస్థితి చాలా కొత్తది. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్రం ఇంకాస్త బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, ప్రజలకు మేలు జరుగుతుంది. లాక్ డౌన్ సమయాన్ని ప్రభుత్వం సద్వినియోగం చేసుకుని కరోనా వ్యాప్తిని అరికట్టి వుండాల్సింది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కేసులు అనూహ్యంగా పెరిగిపోవడం బాధాకరం.

ఇలా సాగింది జనసేనాని ఇంటర్వ్యూ.. ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేయకుండానే, కీలకమైన అంశాల పట్ల తన అభిప్రాయాల్ని, జనసేన పార్టీ విధానాన్ని కుండబద్దలుగొట్టేస్తూ, ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...