Switch to English

కేసులు పెరుగుతోంటే, టెస్టులు తగ్గుతున్నాయెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఆ మధ్య ఒక రోజులో దాదాపు 40 వేల టెస్ట్‌లు చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా వైరస్‌ నేపథ్యంలో. కానీ, ఆ తర్వాత ఆ స్థాయి ఫిగర్‌ ఇంకోసారి అందుకోలేదు సరికదా.. ఈ మధ్య 25 వేల టెస్ట్‌లకు చేరుకోవడం కూడా కష్టమైపోతోంది ఏ రోజు చూసినా. అప్పుడప్పుడూ టెస్టుల సంఖ్య 20 వేల దిగువకు కూడా పడిపోతోంది. కానీ, అదే సమయంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. చిత్రమేంటంటే, తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తెలంగాణలో టెస్టుల సంఖ్య పెరుగుతోంది. ఇంతకీ, ఏం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో.

విపక్షాల నుంచి వస్తున్న విమర్శలు కావొచ్చు, పెరుగుత్ను కేసులు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచక తప్పడంలేదు. అయితే, అలా పెంచడం ద్వారా కేసుల సంఖ్య తగ్గుతుండడంతో తెలంగాణ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. మరీ ముఖ్యంగా గ్రేటర్‌ హైద్రాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతోంది రోజువారీ లెక్కల్లో.

గ్రేటర్‌ హైద్రాబాద్‌లో జనాభాని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ స్థాయిలో కేసులు నమోదవడం అసహజమేమీ కాదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితేంటి.? ఈ రోజు కొన్ని జిల్లాల్లో 300కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ఉలిక్కిపడింది. రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు చేసినప్పుడు, ట్రేసింగ్‌ విషయంలో అత్యద్భుతంగా పనిచేస్తున్నప్పుడు.. కేసుల సంఖ్య తగ్గాలిగానీ, ఎందుకు పెరుగుదల కన్పిస్తోంది.?

పైగా, తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి విషయంలో ఆంక్షలు లేవు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్ళాలంటే కొన్ని ఆంక్షలున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోనే తెలంగాణ కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్న పరిస్థితిని ఇప్పుడు చూస్తున్నాం. అధికార పార్టీకి చెందిన నేతలు విచ్చలవిడిగా రాజకీయ కార్యక్రమాలు చేపడుతుండడం వల్లే ఈ దుస్థితి అన్న విపక్షాల విమర్శల్ని తేలిగ్గా కొట్టిపారేయలేం. కీలక పదవుల్లో వున్న ‘పెద్దలు’ మాస్క్‌లు లేకుండా జనంలోకి వెళ్ళడం, వారిని ఆదర్శంగా తీసుకుని పార్టీ కార్యకర్తలూ విచ్చలవిడిగా తిరిగేస్తుండడం ద్వారా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయన్న విమర్శలకు అధికార పక్షం ఏం సమాధానం చెబుతుంది.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...