Switch to English

జగన్‌ పాలనకు ఏడాది.. అప్పుడే ఎంపీ, ఎమ్మెల్యేలలో అసహనం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇటీవలే ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో సంబరాల్లో హుషారు కాస్త తగ్గినా, నిబంధనల్ని ఉల్లంఘించి మరీ కొందరు నేతలు సంబరాల విషయంలో అత్యుత్సాహం చూపిన మాట వాస్తవం. ఇంతకీ, వైఎస్‌ జగన్‌ ఏడాది పాలన ఎలా సాగింది.? అంటే, ఆ పార్టీ నేతలే ఇప్పుడు పెదవి విరుస్తున్న పరిస్థితి. ఓ ఎంపీగారేమో, ఇసుక కుంభకోణం గురించి ప్రస్తావిస్తారు. మరికొందరు ఎమ్మెల్యేలదీ ఇదే తీరు. ఓ సీనియర్‌ ఎమ్మెల్యేలైతే, అధికారులు సరిగ్గా పనిచేయడంలేదంటారు. ఇంకో ఎమ్మెల్యే అయితే, ఏకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెబుతున్నారు. ఇదంతా అధికార పార్టీకి చెందిన నేతల వ్యవహారమే.

‘నేను ఎప్పటికీ వైఎస్‌ జగన్‌ విధేయుడినే..’ అని పదే పదే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పుకోవాల్సి వస్తోందంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ‘అబ్బే, పార్టీలో ఎలాంటి వ్యతిరేకతా లేదు.. వ్యతిరేకత పేరుతో విపక్షాలు, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి..’ అని కొందరు మంత్రులు చెబుతూ వస్తున్నా, తెరవెనుకాల వ్యవహారాలు వేరేలా వున్నాయి.

ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పటికే పలు అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్న విషయం విదితమే. సీనియర్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గతంలో ఓసారి పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారు. తాజాగా మరోమారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఆనం, టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌గా మారారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇసుక వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెల్సిందే. ఇవన్నీ బాహాటంగా తెరపైకి వస్తున్న నేతల వివరాలు మాత్రమే.

‘సీనియర్‌ని నన్ను పక్కన పెట్టి, జూనియర్లకు పదవులు ఇచ్చారు.. భజన చేసేవారికే పదవులు..’ అంటూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇప్పటికీ ఆయనలో ‘పదవి దక్కలేదన్న’ అసంతృప్తి అలానే వుందని జిల్లాలో టాక్‌ నడుస్తోంది. నామినేటెడ్‌ పదవుల విషయంలోనూ, ఇతరత్రా పదవుల విషయంలోనూ ఓ సామాజిక వర్గానికే ‘పెద్ద పీట’ అంటూ, కొందరు పార్టీ ముఖ్య నేతలు మీడియాకి లీకులు అందిస్తుండడం మరో ఆసక్తికరమైన విషయం.

మొత్తమ్మీద, ‘అసంతృప్తి’ అనూహ్యంగా పెరుగోతందన్నమాట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో. ‘రాష్ట్ర ప్రజలంతా మా వైపే వున్నారు..’ అంటూ ఓ వైపు పార్టీలో భజన బృందం చెబుతోంటే, అలా భజన చేసేది కేవలం పదవుల కోసమేనంటూ అసంతృప్త నేతలు ఆఫ్‌ ది రికార్డ్‌గా చెబుతూ.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వున్న లోటుపాట్లను తమ సన్నిహితుల ద్వారా బయటకు లీక్‌ చేయిస్తుండడం కొసమెరుపు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....