Switch to English

నిమ్మగడ్డని చూసి వైఎస్సార్సీపీ ఎందుకు భయపడ్తోంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

స్థానిక ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ శ్రేణులు ఏ స్థాయిలో అరాచకాలు చేశారో.. వాటన్నిటికీ సోషల్‌ మీడియాలో చాలా వీడియోలు సాక్ష్యాలుగా వున్నాయి. మహిళలపై దాడులు, నామినేషన్లు వేస్తామంటే బెదిరింపులు.. వెరసి, స్థానిక ఎన్నికల వ్యవహారం ఓ ప్రసహనంలా సాగింది. మధ్యలో కరోనా వైరస్‌ రావడంతో స్థానిక ఎన్నికలకు కాస్త బ్రేక్‌ పడింది. ‘జనం ఛస్తే చావనీ.. స్థానిక ఎన్నికలు మాత్రం అయిపోవాలి..’ అనే భావనతో వున్నట్లు వైసీపీ నేతలు, అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై గుస్సా అయ్యారు.

అవును మరి, కరోనా ప్రమాదాన్ని ముందే అంచనా వేసి, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. అక్కడే అసలు కథ మొదలయ్యింది. సరే, ప్రభుత్వం ఆర్డిరెన్స్‌ తీసుకురావడం, ఈ క్రమంలో కొత్త ఎస్‌ఇసిగా కనగరాజ్‌ ప్రమాణ స్వీకారం చేయడం, హైకోర్టు ఆ వ్యవహారాన్ని తప్పుపట్టడం.. ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయడం.. ఇవన్నీ వేరే అంశాలు.

కానీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు నిమ్మగడ్డ అంటే భయపడుతోంది.? ‘ఏం నిమ్మగడ్డ ఏమన్నా బొచ్చు పీకుతాడా.?’ అని సాక్షాత్తూ మంత్రి కొడాలి నాని ఓ ప్రెస్‌ మీట్‌లో వ్యాఖ్యానించారాయె. మరి, అంత గట్టి నమ్మకం ప్రభుత్వానికే వుంటే, నిమ్మగడ్డనే కొనసాగించవచ్చు కదా.! ప్రభుత్వానికి అవకాశం వుంది, సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది.

ఈలోగా అడ్డగోలు రాజకీయ విమర్శలు చేయడం ద్వారా తమ మైలేజ్‌ పెంచుకోవాలనుకుంటున్నారు విజయసాయిరెడ్డి లాంటి నేతలు. లేకపోతే, చంద్రబాబు డజను మంది అడ్వొకేట్లను రంగంలోకి దింపారని విజయసాయిరెడ్డి ఆరోపించడమేంటి.? డజను కాదు కదా.. వెయ్యి మంది అడ్వొకేట్లను పంపినా.. అక్కడ జరగాల్సింది జరుగుతుంది తప్ప, ‘మంది బలం’ అక్కడ పెద్దగా పనిచేయదు. ఆ విషయం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే బాగా తెలుసు.

ఇక, హైకోర్టులో నిమ్మగడ్డకు మద్దతుగా పిటిషన్లు దాఖలు చేసినవారిలో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌ వున్నారు.. రాజకీయ పార్టీలతో సంబంధం లేనివారూ వున్నారు. విజయసాయిరెడ్డికి అంత ధైర్యమే వుంటే.. నిమ్మగడ్డ వ్యవహారంలో అంత చిత్తశుద్ధే వుంటే.. కామినేని శ్రీనివాస్‌నీ, బీజేపీనీ విమర్శించగలగాలి. అప్పుడెప్పుడో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మీద నాలుగు విమర్శలు చేసి లైట్‌ తీసుకున్న విజయసాయిరెడ్డి, బీజేపీ అధిష్టానాన్ని ఈ విషయంలో ఇప్పుడు ప్రశ్నించగలరా.? ఆ ధైర్యం లేనప్పుడు, సోషల్‌ మీడియాలో ఎందుకు ఈ తాటాకు చప్పుళ్ళు.? టైమ్ పాస్‌ పబ్లిసిటీ స్టంట్లు.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...