Switch to English

టిబి స్పెషల్: అయిననూ పోవలెను విశాఖకు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి బాగా మొండిమనిషని పేరు. ఆ మొండితనమే అతనికి ఎన్నో కష్టాలను అధిగమించి సీఎం పీఠం దక్కేలా చేసిందన్నది విమర్శకుల అభిప్రాయం. ఎన్ని అవాంతరాలెదురైనా వెనక్కితగ్గటం అంటే ఆయనకు ఇష్టం ఉండదన్నది ఆంతరంగికుల మాట.

ఇలాంటి జగన్మోహనరెడ్డికి ఇప్పుడు కొంత గడ్డుకాలం నడుస్తోంది. దీనికి సైతం ఆ మొండితనమే కారణమన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. దీంతో తను అనుకున్నవి అనుకున్నట్లు జరగటం లేదన్న ఫ్రస్ట్రేషన్ ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికలకు ముందు రాజధాని అమరావతికి జై కొట్టిన జగన్, ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు.

దాంతో అప్పటివరకూ రేగిన ఇసుక దుమారాన్ని దాటుకుని నెమ్మదిగా గాడిలో పడుతోందనుకుంటున్న పాలన కాస్తా గందరగోళంలో పడింది. సుమారు 150 రోజులుగా రాజధాని రైతుల ఆందోళనలు ఓవైపు సాగుతోంటే మరోవైపు పాలనాపరంగా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఇంకా హైకోర్టు చుట్టూనే తిరుగుతున్నాయి.

ఇక కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసుకునే రాజధాని తరలింపు నిర్ణయాన్ని తీసుకున్నారన్న విమర్శల్ని ఎదుర్కొంటూనే వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేసుకోవాలని వైసీపీ అధిష్టానం ఉవ్విళ్లూరింది. అయితే వారి దూకుడుకు వరుస బ్రేకులు పడుతూనే ఉన్నాయి.

ఓవైపు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మంత్రాంగం, తన ఆలోచనలను సమర్ధంగా ముందుకు తీసుకెళ్లలేని యంత్రాంగం మరోవైపు జగన్ ఆలోచనల్ని కోల్డ్ స్టోరేజ్ కు పంపాయి. రాజధాని తరలింపుపై ఆ ప్రాంత రైతులు కోర్టుకి ఎక్కడం, మే నెలాఖరుకు కేపిటల్ తరలింపు జరగుతున్నట్లు వార్తలు వస్తున్నాయనీ, తమకు న్యాయం చేయమని కోర్టును కోరిన నేపధ్యంలో ప్రభుత్వం తప్పక వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

న్యాయ, శాసనపరమైన అంశాలన్నీ ముగిసిన తర్వాతనే తరలింపు ఉంటుందనీ, అప్పటివరకూ ఎలాంటి ముందడుగు లేదనీ కోర్టుకు అఫిడవిట్ ద్వారా తేల్చిచెప్పింది. దీంతో ఉన్నపళంగా విశాఖపట్నానికి రాజధాని తరలింపు ఉంటుంది, ఇప్పటికే 20 ట్రక్కుల ఫర్మిచర్ ఉంది, స్థానికంగా విజ్జాన్ కళాశాల సమీపంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం రెడీ అవుతోందన్న వార్తలకు తాత్కాలికంగా ప్రభుత్వం చెక్ పెట్టినట్లయింది.

కానీ జగన్ మాత్రం వీలైనంత త్వరగానే ఇక్కడి నుండి మకాం మార్చాలని భావిస్తున్నారు. చంద్రబాబు తాలూకు గత పాలనా ప్రభావం పడకుండా తనదైన మార్క్ చూపాలని ఆయన భావిస్తున్నారు. బాబు హయాంలో నిర్మించిన భవనాల్లో తాను అడుగుపెట్టేందుకు ఇష్టపడటం లేదన్నది సీఎంఓ వర్గాల సమాచారం.

మరి అలా జరిగితే వందల కోట్ల ప్రజాధనం వృధా అంటారా..? కాదని మేం ఎందుకంటాం…? ఉండవల్లి చంద్రబాబు నివాసం సమీపంలో కోట్లరూపాయల విలువైన ప్రజావేదికను నిలువునా కూల్చేసినపుడు అయ్యో అనుకున్నవాళ్లే చాలామంది ఉన్నారు. సరే, వాటి గురించి మళ్లీ మాట్లాడుకుందాం…మొత్తానికి కరోనా విపత్తు, వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రమాదఘటన జరగకపోయి ఉంటే ఈపాటికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ సమీక్షలు విశాఖలోనే జరిగి ఉండేవి.

అయిననూ విశాఖకూ పోవాల్సిందేనన్న జగన్ ఆదేశాలను అమలుచేసేందుకు, అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసేందుకు ఆయన ఆంతరంగికులు విజయసాయిరెడ్డి,ఇతర మంత్రులంతా దిండూ, దుప్పట్లు పట్టుకుని మకాంలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన జగమొండితనాన్ని వీడి అన్ని ప్రాంతాల ప్రజలను సంతృప్తిపరిచేలా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలా కాదంటారా…? ఇక మీ ఇష్టం..రాష్ట్ర ప్రజల్నీ, రాష్ట్రాన్నీ మీరు తరచుగా చెప్పే దేవుడే కాపాడాలి. శుభం భుయాత్..

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...