Switch to English

గుంటనక్కలు.. ఎదవ రాజకీయాలు: వి.సా.రెడ్డిపై నాగబాబు ఫైర్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

సోషల్‌ మీడియాలో ఏదో ఒక చెత్త కామెంట్‌ పెట్టడం.. జనాలతో తిట్టించుకోవడం తప్ప వేరే పనిలేనట్టుంది వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డికి. ఒకరిద్దరు విజయసాయి ట్వీట్లపై హర్షం వ్యక్తం చేస్తే.. వందల మంది ఆయన్ని ఏకి పారేస్తుంటారు. ‘పబ్లిసిటీ కక్కుర్తి’ కాకపోతే, తిట్టించుకోవడం కోసం ట్వీట్లు పెట్టడమేంటట.?

‘కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్‌. ఎక్కడో హైద్రాబాద్‌లో కూర్చుని, నేను లేస్తే మనిషిని కాదు అని చిటికెలేసినట్లుగా వుంది నీ వాలకం. ప్రజా తీర్పుని అప్పుడే మర్చిపోతే ఎలా.?’ అని విజయసాయిరెడ్డి తాజాగా ట్వీటేశారు.

కరోనా వైరస్‌ వేళ జనసేన పార్టీ పాటిస్తున్న సంయమనం అందరికీ తెల్సిందే. కానీ, అధికార వైసీపీ ఏం చేస్తోంది.? అడ్డగోలు రాజకీయాలు చేస్తోంది. ఈ సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని మార్చాల్సిన అవసరం ఏంటి.? ఓ పక్క జనం కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోతోంటే.. స్థానిక ఎన్నికలు ఎలాగైనా జరిపేయాలనే కక్కుర్తి అధికార పార్టీది. తమ రాజకీయ కక్కుర్తికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వ్యవహరించకపోవడంతో, అడ్డగోలు ఆర్డినెన్స్‌ తెచ్చి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని తగ్గించి, కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై ‘కుల’ ముద్ర వేసి, సాగనంపేశారు. న్యాయస్థానాల్లో మొట్టికాయలు అలవాటైపోయిన వైసీపీ ప్రభుత్వానికీ ఈసారి కూడా మొట్టికాయలు తప్పేలా లేవు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారంపై ప్రభుత్వాన్ని జనసేన ప్రశ్నించడంతో, వి.సా.రెడ్డిగారికి కోపమొచ్చి పై విధంగా ట్వీటేశారు.

దానికి స్పందించిన జనసేన నేత నాగబాబు, వైసీపీ గుంటనక్క రాజకీయాల్ని బయటపెట్టారు. ‘విజయసాయిరెడ్డీ.. నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఎదవ రాజకీయాలు చేయడానికి నీలాంటి గుంటనక్కలున్న సంగతి మాకు తెలుసు. విజయసాయిరెడ్డి.. మన ఇద్దరి కామన్‌ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి పవన్‌తో దోస్తీకి రెడీ అన్న మీ గుంట నక్క రాజకీయాలు నాకు గుర్తున్నాయి..’ అంటూ నాగబాబు ట్వీటేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది.

నిజమే, 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీతో పొత్తు కోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. సాక్షాత్తూ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. అయితే, జనసేన అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ, అటు టీడీపీ నేతలు, ఇటు వైసీపీ నేతలు.. గ్రౌండ్‌ లెవల్‌లో పవన్‌ కళ్యాణ్‌ పేరు చెప్పి ఓట్లు అడుక్కున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.? గుంటూరు జిల్లాలో ఓ ముఖ్య నేత అయితే, పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల్ని ఉద్దేశించి తనకే ఓటు వేయాలనీ, లేకపోతే తన రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందనీ కంటతడి పెట్టిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...