Switch to English

అల్లు అర్జున్‌ రెమ్యునరేషన్‌.. అంతలా పెరిగిపోయిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, ‘అల వైకుంఠపురములో’ సినిమాతో తన రేంజ్‌ని మేగ్జిమవ్‌ుకి పెంచేసుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి బిగ్గెస్ట్‌ గ్రాసర్స్‌లో ‘బాహుబలి’ తర్వాతి స్థానంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేరిన విషయం విదితమే.

నిజానికి, మహేష్‌బాబుని ఢీకొనే సత్తా అల్లు అర్జున్‌కి ‘అల వైకుంఠపురములో’ సినిమా ముందు వరకూ లేదు. పైగా, మహేష్‌ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’కి విడుదల రోజే హిట్‌ టాక్‌ వచ్చేసింది. అలాంటిది, అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఎలా ఇండస్ట్రీ హిట్‌ (నాన్‌ బాహుబలి రికార్డ్‌) ఎలా కొట్టేశాడో ఇప్పటికీ ట్రేడ్‌ పండితులకు అర్థం కావడంలేదు. ఇదో మ్యాజిక్‌.. అవును, ఇదొక స్టైలిష్‌ మ్యాజిక్‌.

ఇదిలా వుంటే, అల్లు అర్జున్‌ తన తదుపరి సినిమాకి మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రెమ్యునరేషన్‌ అందుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ చాలా చాలా కష్టపడాల్సి వస్తోంది. సినిమాలో 6 ప్యాక్‌ కాదు, ఎయిట్‌ ప్యాక్‌తో అల్లు అర్జున్‌ కనిపించనున్నాడంటూ ఊహాగానాలు ఓ పక్క విన్పిస్తున్న విషయం విదితమే.

అవన్నీ పక్కన పెడితే, కరోనా ఎఫెక్ట్‌ ఈ సినిమా షూటింగ్‌పైన కూడా పడేలా వుంది. కేరళలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో షూటింగ్‌ వాయిదా పడనుందట. కాగా, ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ రెమ్యునరేషన్‌ అందుకోబోతున్నాడనీ, ఇది మహేష్‌ ప్రస్తుతం అందుకుంటున్నదానికంటే ఎక్కువనీ గుసగుసలు విన్పిస్తున్నాయి.

మరోపక్క, ‘ప్రొడ్యూసర్స్‌ ఫ్రెండ్లీ హీరో’ అనే గుర్తింపుని వదులుకోవడానికి ఇష్టం లేని బన్నీ, నామినల్‌గా మాత్రమే రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడనీ, మిగతా మొత్తం సినిమా విడుదలయ్యాక.. హిట్‌ టాక్‌ వచ్చాక అందుకుంటాడనీ చెబుతున్నారు. ‘ఆ విషయంలో అల్లు అర్జున్‌ ది బెస్ట్‌..’ అంటున్నారు స్టైలిష్‌ స్టార్‌ అభిమానులు. ఈ సినిమాలో రష్మిక మండన్న హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...