దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉన్నది. ఇప్పటి వరకు 105 కేసులు నమోదయ్యాయి. ఈ ఒక్కరోజు మహారాష్ట్రలో కొత్తగా ఐదు కేసులు నమోదు కావడంతో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. మహారాష్ట్రలో ప్రస్తుతం కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నది. ముంబై, పూణే నగరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎయిర్ పోర్ట్స్ వద్ద నిత్యం అధికారులు స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇక పూణే నగరంలో కొత్తగా ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పూణే అంతటా మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
మహారాష్ట్రలో ఇప్పటి వరకు మొత్తం 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కర్ణాటకలోని యడ్యూరప్ప ప్రభుత్వం కూడా ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కర్ణాటకలో ఐదు కేసులు నమోదు కావడం, దేశంలో తొలి కరోనా మరణం కూడా కర్ణాటకలోనే సంభవించడంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.
కర్ణాటకలో వారం రోజులపాటు అన్నింటిని మూసెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు నగరం బోసిపోయింది. బెంగళూరులో 27 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు లేకపోవడంతో బెంగళూరు ప్రజలు అక్కడి నుంచి మైసూర్ వెళ్లిపోతున్నారు. మైసూరులో 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు అక్కడికి పయనం అవుతుండటం విశేషం. కేరళలో కూడా 19 కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది.
2857 435234Normally I do not read article on blogs, nonetheless I wish to say that this write-up really forced me to check out and do so! Your writing taste has been amazed me. Thanks, extremely wonderful post. 201854
480883 98847Cool text dude, keep up the very good function, just shared this with the mates 610410
585599 331454Hey. Quite good internet internet site!! Man .. Outstanding .. Fantastic .. Ill bookmark this web site and take the feeds alsoI am pleased to locate so considerably useful info here within the post. Thanks for sharing 560830