Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: సీమ సహనానికి సెల్యూట్‌ చెయ్యాల్సిందే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని పాలించిన ముఖ్యమంత్రుల్లో సింహభాగం రాయలసీమ నుంచి వచ్చినవారే. ఇప్పుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ని తీసుకుంటే, తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. ఈ ఇద్దరూ సీమ ప్రాంతానికి చెందినవారే. చంద్రబాబుది చిత్తూరు జిల్లా అయితే, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిది కడప జిల్లా. రాజకీయంగా సీమకు ఇంతటి ప్రాధాన్యత వుంది. కానీ, ఏం లాభం.? సీమ ప్రాంతం ఇప్పటికీ సాగు నీరు, తాగు నీరు కోసం తల్లడిల్లిపోతూనే వుంది.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కావొచ్చు, చంద్రబాబు కావొచ్చు.. సీమ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగిన మరొకరు కావొచ్చు.. రాజకీయంగా ఉన్నత పదవులు పొందారేమోగానీ, సీమని మాత్రం ఉన్నత స్థాయికి తీసుకురాలేకపోయారు. ప్రతిసారీ సీమకి ఊరింపులే.. చివరికి ఉస్సూరుమన్పించడాలే. ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఒప్పందాల విషయాన్ని పక్కన పెడితే, కొత్త తరంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత కూడా పరిస్థితులు మారలేదు.

ఇదిగో సీమకి ‘వరాలు’ అంటూ ప్రతి ఒక్కరూ మభ్యపెడుతూనే వస్తున్నారు. కర్నూలుకి హైకోర్టు వస్తే ఏమవుతుంది.? మొత్తం రాయలసీమ అంతా అభివృద్ధి చెందుతుందా.? అంటే, సీమలో ఎవరూ దీన్ని అంగీకరించరు.. కొందరు రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులు తప్ప. మూడు రాజధానుల వ్యవహారం శాసన మండలి దగ్గర ఆగిపోయిన దరిమిలా, సీమ ప్రాంతం సంయమనం పాటిస్తుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీన్ని ప్రజా చైతన్యానికి నిదర్శనంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరోపక్క, ఉత్తరాంధ్రలో కూడా ఇదే పరిస్థితి కన్పిస్తుండడం గమనార్హం. రెచ్చగొట్టేవారు ఎప్పుడూ వుంటారు.. అటు ఉత్తరాంధ్రలోనూ, ఇటు రాయలసీమలోనూ వున్నారు.. వారి పని వారు చేసుకుపోతున్నారు. అమరావతిలో ఏం జరుగుతుందో చూస్తున్నాం.. అమరావతి రైతుల పేరుతో రాజకీయ పార్టీలు ఆడుతున్న పొలిటికల్‌ గేమ్‌నీ చూస్తున్నాం. చిత్తశుద్ధితో రైతులు చేస్తున్న పోరాటానికి రాజకీయ రంగు అంటుకోవడాన్ని కాదనలేం.

ఒక్కటి మాత్రం నిజం.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఎన్నో దశాబ్దాలుగా వింటున్న మాట ఇది. కొత్తగా పాలనా వికేంద్రీకరణ అంశం తెరపైకొచ్చింది. తొలుత అభివృద్ధి వికేంద్రీకరణ చేసి, ఆ తర్వాత పాలనా వికేంద్రీకరణ గురించి ఆలోచించాలన్నది రాష్ట్ర ప్రజానీకం ముక్త కంఠంతో నినదిస్తున్న విషయం. పాలన పాలకులకు సంబంధించినది.. అభివృద్ధి ప్రజలకు సంబంధించినది. దురదృష్టవశాత్తూ రాజకీయ పార్టీలూ, పాలకులూ ప్రజాలకు నిజం చెప్పే ప్రయత్నం చేయడంలేదు. కానీ, ప్రజలు విజ్ఞులు.. ఆ విజ్ఞతే రాష్ట్రాన్ని కాపాడుతోంది. దాన్ని చెడొట్టే ప్రయత్నం జరుగుతూనే వుంటుంది.. అదే రాజకీయమంటే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...