Switch to English

విశాఖను ఊరించి.. సీమకు రాజధాని తరలిస్తారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్‌.. విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌.. విశాఖపట్నంలో వేసవి కాలం అసెంబ్లీ సమావేశాలు.. విశాఖపట్నంలో సీఎం క్యాంప్‌ కార్యాలయం.. అంటూ విశాఖపట్నంపై రాజధాని పేరుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, మంత్రులు చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు.

ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఈ విషయంలో ఓ రేంజ్‌లో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ‘విశాఖలో, కర్నూలులో, అమరావతిలో.. ఇలా మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్‌కి వుండొచ్చు..’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, అసెంబ్లీలో చేసిన ప్రకటనతో మొదలైన దుమారమిది. సీఎం జగన్‌ చేసిన ప్రకటన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ, ఇంకో విధమైన నివేదిక ఇచ్చే ఛాన్సే వుండదు. ఇక, విశాఖ చుట్టూనే ఓ పక్క రచ్చ జరుగుతోంటే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీమ నేతలు, అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

గ్రేటర్‌ రాయలసీమ డిమాండ్‌ తెరపైకొచ్చిందంటే, దాని వెనుకాల అధికార పార్టీ నేతలు వుండరని ఎలా అనుకోగలం.? పైకి, వైసీపీ నేతలెవరూ కన్పించకపోయినా, వైసీపీ మద్దతుదారుల నుంచే ఈ వాదన గట్టిగా విన్పిస్తోంది. కర్నూలులో హైకోర్టు వద్దు, రాజధానిని కర్నూలుకి ఇచ్చేయాలంటూ కొత్త డిమాండ్‌ పుట్టుకొచ్చింది. రాజదానితోపాటు హైకోర్టు బెంచి, సీఎం కార్యాలయం, అసెంబ్లీ కూడా కర్నూలులోనే వుండాలన్నది వారి వాదన. ఎప్పుడైతే సీమ నుంచి ఈ తరహా వాదన వచ్చిందో, ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

అదే సమయంలో ప్రస్తుత రాజధాని అమరావతి ప్రాంత వైసీపీ ప్రజా ప్రతినిథులు కూడా తాజా పరిణామాలపై ఆందోళన చెందుతున్నారు. పైకి మాత్రం నీళ్ళు నములుతున్నా.. సీమ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలపై, మిగతా నేతలంతా గుస్సా అవుతున్నారట. నిజానికి, ఇదేమీ అనూహ్యమైన పరిణామం కాదు. ఉత్తరాంధ్ర మీద రాజకీయ పార్టీల మమకారంలో చిత్తశుద్ధి ఏంటో చాలాకాలంగా చూస్తూనే వున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ భౌగోళికంగా ఓ మూలకు విసిరివేయబడ్డట్టుండే ఉత్తరాంధ్రని, రాజకీయంగానూ ఎప్పుడో ఓ మూలకి విసిరేశారు. సో, విశాఖను ఊరించి.. సీమలో తమ వ్యూహాల్ని అధికార వైఎస్సార్సీపీ.. అత్యంత సమర్థవంతంగా అమలు చేయబోతోందన్నమాట.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...