Switch to English

వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్న బొత్స కామెంట్స్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

రాజధాని అమరావతిపై చాలా కాలంగా మంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పట్లో కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు కొందరు, బొత్స వ్యాఖ్యల్లో పెడార్ధాలు తీయొద్దనీ, ఆయనేమీ రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడటంలేదనీ బుకాయించిన విషయం విదితమే. కానీ, బొత్స సత్యనారాయణ చెప్పినట్లే.. రాజధాని అమరావతి విషయంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు చెప్పినట్లు, ‘వైఎస్‌ జగన్‌ పేపర్‌ లీక్‌ చేస్తే, జీఎన్‌ రావు కమిటీ పరీక్ష రాసింది..’ అనే చర్చ మూడు రాజధానుల వ్యవహారంపై రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. అమరావతిని ఎడ్యుకేషనల్‌ క్యాపిటల్‌ని చేస్తామనీ, రాజధాని రైతులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చుతామనీ బొత్స సత్యనారాయణ తాజాగా సెలవిచ్చారు. అమరావతిలో నిర్మాణాల ఖర్చు ఎక్కువని చెబుతూనే, ఎడ్యుకేషనల్‌ క్యాపిటల్‌గా అమరావతిని ఎలా మార్చుతారో బొత్సకే తెలియాలి.

పైగా, ప్రస్తుతం నిర్మాణ దశలో వున్న ఆయా భవనాల పరిస్థితేంటన్నదానిపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఇదిలా వుంటే, రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలకు చెందిన రైతులు, తమ ప్రజా ప్రతినిథులపై ఒత్తిడి పెంచుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిథుల ఇళ్ళ ముందు నిరసనలకు సమాయత్తమవుతున్నారు.

‘మీ పదవులు పోతే, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది.. మా తరఫున నిలబడండి.. లేదంటే, పదవులకు రాజీనామా చేయండి..’ అంటూ రాజధాని రైతులు డిమాండ్‌ చేస్తున్న దరిమిలా, ఒకరొకరుగా వైసీపీ నేతలు, అమరావతి రైతుల తరఫున కాస్తంత సానుకూల ప్రకటనలు చేస్తున్నారు. ‘రైతులు ఆవేదనతో వున్నారు.. ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు.. అగ్నికి ఆజ్యం పోసేలా బొత్స వ్యవహరించడం తగదు. బొత్స కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కష్టకాలం దాపురించేలా వుంది..’ అంటూ అమరావతి రైతులకి మద్దతు ప్రకటించిన ఒకరిద్దరు వైసీపీ నేతలు చెబుతున్నారు.

మరోపక్క, ఈ రెండు జిల్లాలకు చెందిన కొందరు మంత్రులు కూడా, బొత్స చేస్తున్న ‘అతి’ పట్ల అసహనంతో ఊగిపోతున్నారట. బొత్స వ్యవహార శైలిపై జగన్‌ వద్ద పంచాయితీ పెట్టే ఆలోచనలో కొందరు వైసీపీ నేతలు వుండగా, ‘దానివల్ల ప్రయోజనం లేదు..’ అంటూ మరికొందరు వారిని వారిస్తున్నారట.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...