Switch to English

మేఘాపై కొనసాగుతున్న ఐటీ దాడులు: మేటర్‌ సీరియస్సేనట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మేఘా సంస్థ తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతోంది. అలాంటి సంస్థపై ఐటీ దాడులు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ఐదు రోజులుగా ఐటీ సోదాలు మేఘా సంస్థపై జరుగుతున్నా.. తెలుగు మీడియా మాత్రం వ్యవహారాన్ని చాలా ‘తక్కువ స్థాయిలోనే’ ప్రొజెక్ట్‌ చేస్తోంది. అదే, ఇంకేదన్నా సంస్థ మీద ఇలాంటి ఐటీ దాడులు జరిగితే.. ఆ రచ్చ మామూలుగా వుండేది కాదు.

సోదాల్లో కొన్ని కీలక పత్రాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారనీ, వాటి ఆధారంగా మరికొన్ని దాడుల్ని అధికారులు చేస్తున్నారనీ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతోగానీ, తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకు మేఘా సంస్థ అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తోందనీ.. ఈ కారణంగానే మేఘా సంస్థపై ఐటీ దాడులు జరుగుతున్నాయనీ ఇంకో వాదన తెరపైకొచ్చింది.

ఇదిలా వుంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి భారీయెత్తున ‘ప్రయోజనం’ మేఘా సంస్థకు జరిగిందనీ, పరస్పర సహకారం కింద ప్రభుత్వంలోని పెద్దలకూ ఆ మేలు జరిగిందనీ, మరోపక్క.. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహా ‘మేలు’ కోసం స్కెచ్‌ నడిచిందనీ, ఈ నేపథ్యంలోనే అక్కడ రివర్స్‌ టెండరింగ్‌ జరుగుతోందనీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చేందుకు కేంద్రం నడుం బిగించి, ఐటీ సోదాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలొస్తుండడం గమనార్హం.

పెద్ద పెద్ద సంస్థలు అన్ని రాజకీయ పార్టీలకూ అత్యంత సన్నిహితంగానే వ్యవహరిస్తాయి. అయితే, ఇటీవలి కాలంలో ‘మార్పు’ స్పష్టంగా కన్పిస్తోంది. ఆయా సంస్థలు అధికార పార్టీలకు తొత్తుల్లా వ్యవహరిస్తుండడం గమనార్హం. అలా ప్రభుత్వానికి సన్నిహితంగా వుండే సంస్థలకు అదనపు ప్రయోజనాలే కాదు, నామినేటెడ్‌ పోస్టులు కూడా దక్కుతుండడం కొసమెరుపు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని సంస్థలు కేంద్రం ‘టార్గెట్‌’లోకి వచ్చాయని అనుకోవచ్చేమో.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...