Switch to English

పోయేవారిని పోనివ్వడమే జనసేన ట్రెండ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

రాజకీయ నేతలు పార్టీలు మారడం చాలా కామన్. ఎన్నికల సమయంలో జంప్ జిలానీలు చాలామంది కనిపిస్తుంటారు. తమకు అనువుగా ఉండే పార్టీలోకి మారిపోతూ ఉంటారు. అలాంటివారిని బుజ్జగించడానికి ఆయా పార్టీలు పాట్లు కూడా పడుతుంటాయి. అయితే, పార్టీ మారాలి అని నిర్ణయం తీసుకున్నవారిని ఆపడం కరెక్ట్ కాదనే వాదన కూడా వినిపిస్తుంటుంది. తాజాగా జనసేన అదే సూత్రాన్ని ఫాలో అవుతోంది.

ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ నుంచి పలువురు నేతలు వరుసగా జారిపోతున్నారు. అటు బీజేపీలోకో, ఇటు వైఎస్సార్ సీపీలోకో వెళ్లిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే అనకాపల్లి నుంచి పోటీ చేసిన చింతా పార్థసారథి, రాజమండ్రి నుంచి బరిలో నిలిచిన ఆకుల సత్యనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పార్టీ మారుతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. పైగా ఆయన జనసేనకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడంలేదు.

ఇలా ఒకరి తర్వాత మరొకరు కాస్త పేరున్న నేతలతోపాటు జూనియర్ నేతలు కూడా జనసేనను వీడి వెళ్లడం జనసైనికుల్లో ఆందోళన పెంచుతోంది. అయితే, పార్టీలో ఇలాంటి కీలక పరిణామాలు సంభవిస్తున్నా జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం చలించడంలేదు. పార్టీ వీడి వెళ్లేవారిని ఆపడం గానీ, వారితో మాట్లాడటం గానీ చేయడంలేదు. పెద్ద పెద్ద పార్టీలు సైతం ఇలాంటి సందర్భాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయి. పార్టీ వీడి వెళ్లేవారిని బుజ్జగించడానికి ప్రయత్నిస్తాయి.

కానీ జనసేనలో మాత్రం అలాంటి ఒరవడి ఏమీ లేదు. ఇలాంటి వ్యవహారాలు పవన్ దృక్పథానికి పూర్తి విరుద్దమని చెబుతున్నారు. ‘‘మనం రమ్మని అడిగితే వారు రాలేదు.. వెళ్లిపోమని మనం చెప్పలేదు. వారంతట వారే నిర్ణయం తీసుకుని వెళ్లిపోతున్నారు. అలాంటివారిని బతిమాలినా ప్రయోజనం ఉండదు. వెళ్లేవారిని వెళ్లనివ్వడమే ఉత్తమం’’ అనేది పవన్ వైఖరి అని పేర్కొంటున్నారు. మరి ఇలా నేతలంతా వెళ్లిపోతే పార్టీ పరిస్థితి ఏమిటని జనసేన నేతల వద్ద ప్రస్తావించగా.. పవన్ కు ఈ విషయంలో వ్యూహం ఉందని, పార్టీ కోసం నిజంగా కష్టపడేవారినే ప్రోత్సహించాలన్నది ఆయన నిర్ణయమని చెబుతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...