Switch to English

కుమార్తె కవితపై గులాబీ బాస్ కేసీఆర్ నజర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైన నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాజకీయ భవితవ్యంపై ఆమె తండ్రి, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. లోక్ సభ ఎన్నికల్లో కాస్త వెనకబడి తొమ్మిది సీట్లు గెలుచుకోగలిగారు. అయితే, నిజామాబాద్ స్థానం నుంచి పోటీచేసిన సిట్టింగ్ ఎంపీ కవిత ఓటమి చెందడం కేసీఆర్ కు ఇబ్బందిగా పరిణమించింది. అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ధర్మపురి అరవింద్ విజయం సాధించారు.

ఆ ఓటమి అనంతరం కవిత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. లోక్ సభ ఎన్నికల పలితాలు వచ్చి మూడు నెలలు పూర్తికాగా, ఆమె పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అటు నియోజకవర్గానికి గానీ, ఇటు తెలంగాణ భవన్ లో గానీ కనిపించడంలేదు. పూర్తిగా హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెను రాజ్యసభకు పంపించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు పదవీకాలం వచ్చే ఏడాది మేతో ముగుస్తుంది.

తద్వారా ఏర్పడే ఖాళీని కవితతో భర్తీ చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. తాజాగా టీఆర్ఎస్ వర్గాల్లో మరో మాటలు వినిపిస్తున్నాయి. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో ప్రస్తుత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్థానం ఖాయమని, ఆయన్ను కేబినెట్లోకి తీసుకుని.. కవితకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తద్వారా వచ్చే ఏడాది రాజ్యసభకు పంపించే వరకు కుమార్తెను రాజకీయంగా ప్రజల్లోనే ఉంచేలా కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నారని పేర్కొంటున్నారు.

అయితే, ఇది నిజం కాదని మరికొందరు స్పష్టంచేస్తున్నారు. ‘‘వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్.. క్రమంగా పార్టీపై పట్టు పెంచుకుంటున్నారు. పలు అంశాల్లో దూసుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన్ను సారథి బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఎంత మాత్రం ఉండదు. పైగా త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ ఇలాంటి ప్రయోగాలు చేయరు. కేటీఆర్ ను కేబినెట్లోకి తీసుకున్నప్పటికీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన్నే కొనసాగిస్తారు’’ అని టీఆర్ఎస్ నేత ఒకరు పేర్కొన్నారు. కవితను రాజ్యసభకు పంపించే అవకాశాలే ఎక్కువని ఆయన అభిప్రాయపడ్డారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...