Switch to English

సుజనా చౌదరికి లైన్ క్లియర్ చేసిన పోతిన మహేష్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు దేశం పార్టీకి సుజనా చౌదరి ఒకప్పుడు ఆర్థికంగా వెన్ను దన్నుగా వుండేవారు.

టీడీపీకి షాకిచ్చి బీజేపీలో చేరారన్నమాటేగానీ, బీజేపీలో వుంటూ, చంద్రబాబు కోసం సుజనా చౌదరి పని చేశారన్నది బహిరంగ రహస్యం. సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ బీజేపీ నుంచి దక్కడానికి చంద్రబాబు చేసిన కృషి అంతా ఇంతా కాదు.

ఇదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున టిక్కెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్, తాజాగా నేడు వైసీపీలో చేరిపోయారు. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు పోతిన మహేష్.

జనసేన పార్టీకి సంబంధించి పంచకర్ల సందీప్, పోతిన మహేష్ లాంటి నాయకులకి జనసేన కార్యకర్తల్లో స్పెషల్ అభిమానం వున్నమాట వాస్తవం. పోతిన మహేష్ టిక్కెట్ దక్కించుకోలేకపోవడాన్ని చాలామంది జనసైనికులు తొలుత జీర్ణించుకోలేకపోయారు.

‘వైసీపీతో టచ్‌లో వున్నాడాయన..’ అన్న టాక్ మొదటి నుంచీ మహేష్ మీద వుందిగానీ, ఆయన జనసేనకు వెన్నుపోటు పొడుస్తారంటే ఎవరూ నమ్మలేదు. టైమ్ చూసి వెన్నుపోటు పొడిచాడు పోతిన మహేష్. నిజానికి, తొందరపాటు నిర్ణయమే తీసుకున్నాడాయన.

కాస్త ఓపిక పట్టి వుంటే, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకుడిగా ఆయన బలం మరింత పెరిగి వుండేది. సుజనా చౌదరికి ఢిల్లీ రాజకీయాలంటే ఆసక్తి ఎక్కువ. విజయవాడ వెస్ట్‌లో ఓడితే, ఆయన మళ్ళీ ఢిల్లీ రాజకీయాలకే పరిమితమవుతారు. అప్పుడు పోతిన మహేష్, చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం వుండేది.

ఇక్కడ జనసేనకీ ఓ మంచి జరిగింది. పోతిన మహేష్ అసలు రంగు ఏంటన్నది బయటపడిపోయింది. ‘పవన్ కళ్యాణ్ ఏం చేసినా, అన్నీ ఆలోచించే చేస్తారు. పోతిన మహేష్‌కి టిక్కెట్ ఇవ్వకపోవడంలోనూ ఆయన నిర్ణయం సరైనదే’ అని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.

అన్నట్టు, ఈ మొత్తం వ్యవహారంలో సుజనా చౌదరికి కాలం కలిసొచ్చినట్లయ్యింది. ఇప్పటిదాకా సుజనా చౌదరి మీద వున్నచీదరింపు జనసైనికుల్లో కాస్త తగ్గింది. చిన్న గీత.. పెద్ద గీత లెక్క తెలుసు కదా.! చీదరింపు విషయంలో మహేష్ పెద్ద గీత అయి కూర్చున్నారిప్పుడు. పోతిన మహేష్ కంటే, సుజనా చౌదరి బెటర్.. పైగా పొత్తు ధర్మం.. అని విజయవాడ వెస్ట్‌లో జనసైనికులు సర్దుకుపోతున్నారు.

ఈ అనూహ్యమైన రాజకీయ పరిణామం నేపథ్యంలో సుజనా చౌదరి విజయావకాశాలు కాస్త మెరుగుపడినట్లే కనిపిస్తోంది.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...