Katchatheevu: దేశంలో ఎన్నికల ఫీవర్ నెలకొన్న వేళ కచ్చతీవు (Katchatheevu) ద్వీపం అంశం చర్చనీయాంశమైంది. 50ఏళ్ల క్రితం కాంగ్రెస్ (Congress) నిర్లక్ష్యంగా కచ్చతీవును శ్రీలంక (Srilanka) కు ఇచ్చేసిందని ఇటివల ప్రధాని మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. దీనిపై శ్రీలంక స్పందించింది. మత్స్యశాఖ మంత్రి డగ్లస్ దేవానంద మాట్లాడుతూ..
ఇండియాలో ఎన్నికల సమయం. ఇటువంటి వ్యాఖ్యలు సహజమే. 1974 ఒప్పందం ప్రకారం కచ్చతీవును శ్రీలంకకు అప్పగించారు. అప్పటికీ ఇరుదేశాల మత్స్యకారులు ఎక్కడైనా చేపలు పట్టుకునేవారు. 1976లో జరిగిన మరో ఒప్పందంతో సముద్రంలో సరిహద్దులు విభజించడంతో ఒకరు మరొకరి జలాల్లోకి వచ్చి చేపలు పట్టకూడదు’.
‘కచ్చతీవు కంటే 80శాతం వనరులున్న వెస్ట్ బ్యాంక్ ప్రాంతం కన్యాకుమారికి దిగువన ఉంది. అది ఇండియాకు దక్కింది. కాబట్టి.. కచ్చతీవును భారత్ స్వాధీనం చేసుకోవాలనే తలంపే అనవసరం. ఇది పూర్తిగా రాజకీయపరమైన వ్యాఖ్యలే తప్ప భారత్ ఆరోపణలపై ఎటువంటి ఆధారమూ లేద’ని అన్నారు.
కాంగ్రెస్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే కచ్చతీవు అంశాన్ని బీజేపీ తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.