ఏదైనా టైమ్ అంతే! టైమ్ సరిగ్గా నడిస్తే మన ఫేట్ ఎలా తిరుగుతుందో ఎవ్వరం ఊహించలేం. ఇప్పుడు దీనికి సరైన ఉదాహరణగా నిలుస్తున్నారు డియోల్ బ్రదర్స్. అన్న సన్నీ డియోల్ హీరోగా హిట్ కొట్టి దశాబ్దం దాటిపోయింది. సాధారణ ప్రేక్షకులు సన్నీ డియోల్ ను మర్చిపోతున్నారు కూడా. అలాంటి సమయంలో గద్దర్ 2 తో సంచలన విజయం సాధించాడు. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా 500 కోట్ల మార్క్ ను దాటేసింది.
ఇప్పుడు బాబీ డియోల్ యానిమల్ లో విలన్ గా నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. గట్టిగా కనిపించేది స్క్రీన్ మీద 15 నిముషాలు. అందులోనూ మాటలు రాని పాత్ర. అయితేనేం సినిమా చూసి వచ్చాక బాబీ డియోల్ మనకు గుర్తుండిపోతాడు.
ఇప్పుడు ఈ ఇద్దరు బ్రదర్స్ ఈ హిట్స్ తో వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయారు. వీరి తండ్రి ధర్మేంద్ర కూడా ఈ ఏడాది రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానిలో కనిపించాడు.